తెలంగాణ(Telangana) ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం కొత్త హెల్త్ పాలసీని త్వరలో అమల్లోకి తీసుకురానుంది. ఈ ఆరోగ్య పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.84 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ స్కీమ్ను సమర్థవంతంగా అమలు చేయడానికి ముఖ్య కార్యదర్శి (సీఎస్) ఛైర్మన్గా 16 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ పాలసీ అమలు విధానాలు, ఆసుపత్రుల ఎంపిక, చికిత్సల పరిధి వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
Read Also: Municipal Polling Counting : మొదలైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. !!
515 ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో 1,885 చికిత్సలు
ఈ హెల్త్ పాలసీ కింద రాష్ట్రవ్యాప్తంగా ఎంప్యానెల్ చేసిన 515 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మొత్తం 1,885 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఖరీదైన శస్త్రచికిత్సలు, స్పెషలిస్ట్ చికిత్సలు, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలను కూడా వ్యయ పరిమితి లేకుండా అందించనున్నట్లు తెలుస్తోంది.
15 రోజుల్లో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
ఈ కీలక ఆరోగ్య పథకాన్ని వచ్చే 15 రోజుల్లో ముఖ్యమంత్రి(Telangana) అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ స్కీమ్ అమలుతో ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య ఖర్చుల భారం తగ్గనుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు ఖరీదైనవిగా ఉండటంతో చాలామంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కొత్త హెల్త్ పాలసీ అమలులోకి వస్తే, వారికి మెరుగైన వైద్య సేవలు సులభంగా, ఉచితంగా లభించనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: