ఈ రోజుల్లో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారింది. ఇది రోజువారీ జీవితానికి బాగా ప్రభావం చూపిస్తున్నది, ముఖ్యంగా ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డయాబెటిస్ రోగులు తెలుసుకోవాలి. డయాబెటిస్ రోగుల కోసం అతి ముఖ్యమైన విషయం, వారి ఆహారంలో పచ్చి పండ్లను, ఆకు కూరలను జోడించడం. అయితే, పండ్ల రసాలు లేదా జ్యూస్లు తాగడం అనేది చాలా మంది డయాబెటిస్ రోగులు ప్రశ్నించే అంశంగా మారింది.
ప్రస్తుతకాలంలో చాలా మంది పండ్ల రసాలు తీసుకోవడాన్ని ఇష్టపడతారు. డయాబెటిస్ కంట్రోల్ చేయాలనుకుంటే ఈ పండ్ల రసం పక్కన పెట్టండి ప్రస్తుత కాలంలో డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అయితే డయాబెటిస్ ఉన్న రోగులు తాము తినే ఆహారంపై శ్రద్ధ చూపించాలి. లేకపోతే రక్తంలో చక్కెర పరిణామం పెరిగి.. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వ్యాధి నిర్వహణ ఆహారం జీవనశైలిపై చాలా ఆధారపడి ఉంటుంది. మీరు మీ ఆహారంలో కొంచెం మార్పు చేసినా, దాని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు డయాబెటిస్ రోగి అయితే, మీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని మాత్రమే తినాలి. డయాబెటిక్ రోగులు ఆకు కూరలు, పండ్లు తినమని వైద్యులు సలహా ఇచ్చినప్పటికీ. డయాబెటిక్ రోగులు జ్యూస్లు తాగకుండా ఉండాలి. ఎందుకంటే చాలా పండ్లలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. జ్యూస్ తాగడం వల్ల చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.
పండ్ల రసాలను ఎందుకు నివారించాలి?
నారింజ:
నారింజలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఉదయం నారింజ రసం తాగడం ద్వారా చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే, నారింజను పండుగా తినడం ద్వారా సహజ ఫైబర్ పొందవచ్చు, ఇది ఆరోగ్యానికి మంచిది.
పైనాపిల్:
పైనాపిల్లో కూడా సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా గ్లైసెమిక్ సూచిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను ప్రేరేపిస్తుంది. దీంతో పైనాపిల్ను పూర్తిగా తినడం మెరుగైన ఎంపిక.
ఆపిల్:
ఆపిల్ తినడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఆపిల్ జ్యూస్ తాగడం వల్ల సహజ చక్కెర పెరిగిపోతుంది. కనుక, ఆపిల్ పండును తినడం మెరుగైన ఎంపిక.
ద్రాక్ష:
ద్రాక్షలో కూడా అధిక చక్కెర ఉంటుంది. ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ, దానిలో ఉండే చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ద్రాక్షను పరిమిత పరిమాణంలో తినడం మంచిది.
డయాబెటిస్ రోగులకు మంచివైన జ్యూస్లు
కాకరకాయ రసం:
కాకరకాయ రసం మధుమేహం కలిగిన రోగులకు చాలా ఉపయోగకరమైనది. ఇది చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.
సొరకాయ రసం:
సొరకాయ రసం కూడా డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
కీర దోసకాయ రసం:
దోసకాయ పుదీనా రసం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది చక్కెర స్థాయిని పెంచకుండా అందిస్తుంది.
నిపుణుల సూచన
ప్రతి డయాబెటిస్ రోగికి, వారి శరీరానికి అనుగుణంగా ఆహార పద్ధతులు ఉండాలి. జ్యూస్లను తాగకుండా ఉండటం, సాధారణ పండ్లను తినడం డయాబెటిస్ యొక్క నియంత్రణలో సహాయపడుతుంది. ప్రతి జ్యూస్ను తాగినప్పుడు, దాని చక్కెర స్థాయిని పరిగణనలో పెట్టాలి. డయాబెటిస్ రోగులకు, స్వస్థ, సహజ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఎప్పుడూ వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.