వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్
విజయవాడ : హెచ్ఐవీ (HIV) నియంత్రణ, బాధితులకు వైద్య సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, దేశంలోనే తొలిసారి ప్రథమ ర్యాంకు సాధించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరుతో పోలిస్తే రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ న్యాకో నిర్దేశించిన ఇండికేటర్లలో అద్భుతమైన పనితీరు కనబరిచి, మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని ప్రకటించారు.
Read also: Pecan Nuts : పీకన్ నట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

ఎయిడ్స్ నియంత్రణ సంస్థ
33 ఇండికేటర్ల (పనితీరు సూచికలు)కు కేటాయించిన 138కి 105 మార్కులను ఏపీ సాధించిందని చెప్పారు. న్యాక్ (నేషనల్ కంట్రోల్ ఆర్గనైజేషన్) విడుదల చేసిన అర్థ సంవత్సర వార్షిక నివేదికలో పేర్కొన్న ర్యాంకింగ్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు ముందుందని వెల్లడించారు. ఇదే ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పనితీరు ప్రతిపాదికన న్యాక్ విడుదల చేసిన త్రైమాసిక నివేదికలో ఏపీ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. దీనిని అధిగమిస్తూ తొలి స్థానంలో నిలిచేలా పనితీరు కనబరిచిన ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారులు, ఉద్యోగులను మంత్రి సత్యకుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: