చిన్న పిల్లలకు ప్రొటీన్లు(Child Nutrition) ఎక్కువగా ఉన్న పప్పులను అధికంగా ఇవ్వడం వల్ల అజీర్తి, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆరు నెలల తర్వాత మొదటిసారి ఘన ఆహారం ప్రారంభించే సమయంలో జాగ్రత్తగా ఆహారాన్ని పరిచయం చేయాలని సూచిస్తున్నారు. డ్రైఫ్రూట్స్ వంటి పోషకాహారాలను 8–9 నెలల వయస్సులో చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఆహారంలో చేర్చడం సరిపోతుందని చెబుతున్నారు. అలాగే రాగిజావ, యాపిల్, అరటిపండు వంటి పండ్లను బాగా మెదిపి లేదా గుజ్జుగా చేసి పిల్లలకు ఇవ్వవచ్చు.

అయితే అన్ని ఆహార పదార్థాలను(Child Nutrition) ఒకేసారి పరిచయం చేయకుండా, ప్రతి కొత్త ఆహారం మధ్య కనీసం 15 రోజుల విరామం తీసుకోవడం మంచిదని నిపుణుల సూచన. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఏ ఆహారం సరిపడటం లేదో గుర్తించడం సులభమవుతుందని, జీర్ణ సమస్యలను నివారించవచ్చని వారు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: