అనారోగ్య సమయంలో మందులు తీసుకునేటప్పుడు చాలామంది టాబ్లెట్ స్ట్రిప్పై కనిపించే ఎర్రటి గీత (Red Line) ను గమనించరు. అయితే ఈ గుర్తు ఉన్న మందులను వైద్యుడి సూచన లేకుండా వాడకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరిస్తోంది. టాబ్లెట్ స్ట్రిప్పై ఉండే ఎర్ర గీత సాధారణంగా యాంటీబయాటిక్స్(Antibiotics Warning) కు సంబంధించినది. ఇవి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవడం ప్రమాదకరమని ఆరోగ్య శాఖ చెబుతోంది.
Read Also: Immunity tips:శీతాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
యాంటీబయాటిక్స్ ఇష్టారీతిన వాడితే ప్రమాదమే
డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్(Antibiotics Warning) తీసుకోవడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సమస్య పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా మందులు పని చేయని పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మందులు కొనుగోలు చేసే సమయంలో:
- టాబ్లెట్ స్ట్రిప్పై రెడ్ లైన్ ఉందా లేదా గమనించాలి
- గడువు తేదీ (Expiry Date) చెక్ చేయాలి
- వైద్యుడి సూచనతోనే మందులు వాడాలి
ఈ విషయాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: