తెలంగాణ మున్సిపల్ ఎన్నికల(TG Municipal Elections Results) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో పలు మున్సిపాలిటీల్లో వార్డు స్థాయి ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీ కొనసాగుతుండగా, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది.
Read Also:TG Municipal Election Results: కాంగ్రెస్ లీడ్, బీఆర్ఎస్ తొలి విజయం
బీజేపీ విజయం సాధించిన వార్డులు
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ మొదటి వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం సాధించారు. అలాగే కాగజ్నగర్ మున్సిపాలిటీ 21వ వార్డులో కూడా బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఈ రెండు ప్రాంతాల్లో బీజేపీ బలమైన ప్రదర్శన చేసింది. ములుగు మున్సిపాలిటీ మొదటి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం(TG Municipal Elections Results) మున్సిపాలిటీలో 13వ, 15వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే కొల్లాపూర్ మున్సిపాలిటీ 14వ వార్డులో కూడా కాంగ్రెస్ గెలుపు నమోదు చేసింది.
బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్న వార్డులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 4వ, 11వ, 12వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే రామాయంపేట మున్సిపాలిటీ 10వ వార్డులో కూడా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇంకా అనేక వార్డుల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో ఫలితాలు గంటగంటకూ మారే అవకాశం ఉంది. అధికారిక ప్రకటనల కోసం రాజకీయ వర్గాలు, అభ్యర్థులు, పార్టీ నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: