ఒకప్పుడు రైతులు పంట పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని తీవ్రంగా నష్టపోయేవారు. వడ్డీ భారం, సరైన దిగుబడి లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు గత ప్రభుత్వం రైతు బంధు పథకంను ప్రవేశపెట్టి ఎకరానికి ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందించింది. దీనివల్ల రైతులకు సాగు ప్రారంభంలోనే ఆర్థిక భరోసా లభించింది. తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని కొనసాగిస్తూ, పేరు మార్చి రైతు భరోసాగా అమలు చేస్తోంది. ఎన్నికల హామీ మేరకు ఎకరానికి ఇచ్చే సాయాన్ని రూ.12 వేలుగా పెంచింది. ఇప్పటికే కొన్ని విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి.
Read also: Last day winds india 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
The Revanth government has taken a crucial decision on farmer
శాటిలైట్ సర్వే & కీలక నిర్ణయం
వేసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదలలో ఈసారి ఆలస్యం జరిగింది. అర్హులైన రైతులకే పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం శాటిలైట్ ఆధారిత సర్వేను చేపట్టింది. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా దాదాపు 10 వేల రెవెన్యూ గ్రామాల్లో సాగు భూములపై అధ్యయనం జరిగింది. మ్యాపులు, పంటల వివరాల ఆధారంగా సాగులో ఉన్న భూములను గుర్తించారు. ఈ సర్వేలో సుమారు 10 శాతం భూముల్లో పంటలు సాగు కావడం లేదని తేలింది. అందువల్ల ఈసారి ఆ భూములకు రైతు భరోసా నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నివేదికను ఫిబ్రవరి 6న ప్రభుత్వానికి అందించనున్నారు.
నిధుల విడుదల ఎప్పుడు?
ప్రస్తుతం పంటలు సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాటిలైట్ సర్వే ఆధారంగా అర్హతను నిర్ణయించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరి వారంలో వేసంగి రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. వానాకాలం సీజన్లో సుమారు 69 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ఈసారి ఆ సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉంది. సాగు చేయని భూములకు పెట్టుబడి సాయం నిలిపివేయడం వల్ల నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం రైతు భరోసా పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చే దిశగా కీలక అడుగుగా చెప్పవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: