📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

TG Government: రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్..

Author Icon By Rajitha
Updated: February 1, 2026 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకప్పుడు రైతులు పంట పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని తీవ్రంగా నష్టపోయేవారు. వడ్డీ భారం, సరైన దిగుబడి లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు గత ప్రభుత్వం రైతు బంధు పథకంను ప్రవేశపెట్టి ఎకరానికి ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందించింది. దీనివల్ల రైతులకు సాగు ప్రారంభంలోనే ఆర్థిక భరోసా లభించింది. తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని కొనసాగిస్తూ, పేరు మార్చి రైతు భరోసాగా అమలు చేస్తోంది. ఎన్నికల హామీ మేరకు ఎకరానికి ఇచ్చే సాయాన్ని రూ.12 వేలుగా పెంచింది. ఇప్పటికే కొన్ని విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి.

Read also: Last day winds india 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

The Revanth government has taken a crucial decision on farmer

శాటిలైట్ సర్వే & కీలక నిర్ణయం

వేసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదలలో ఈసారి ఆలస్యం జరిగింది. అర్హులైన రైతులకే పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం శాటిలైట్ ఆధారిత సర్వేను చేపట్టింది. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా దాదాపు 10 వేల రెవెన్యూ గ్రామాల్లో సాగు భూములపై అధ్యయనం జరిగింది. మ్యాపులు, పంటల వివరాల ఆధారంగా సాగులో ఉన్న భూములను గుర్తించారు. ఈ సర్వేలో సుమారు 10 శాతం భూముల్లో పంటలు సాగు కావడం లేదని తేలింది. అందువల్ల ఈసారి ఆ భూములకు రైతు భరోసా నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నివేదికను ఫిబ్రవరి 6న ప్రభుత్వానికి అందించనున్నారు.

నిధుల విడుదల ఎప్పుడు?

ప్రస్తుతం పంటలు సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాటిలైట్ సర్వే ఆధారంగా అర్హతను నిర్ణయించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరి వారంలో వేసంగి రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. వానాకాలం సీజన్‌లో సుమారు 69 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ఈసారి ఆ సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉంది. సాగు చేయని భూములకు పెట్టుబడి సాయం నిలిపివేయడం వల్ల నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం రైతు భరోసా పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చే దిశగా కీలక అడుగుగా చెప్పవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Farmer Investment Support latest news Rythu Bharosa Update Telangana agriculture Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.