Tejas Jet Crash: భారత్ స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానంగా గుర్తింపు పొందిన తేజస్ ఫైటర్ జెట్లు ఇటీవల వరుస ప్రమాదాలతో చర్చనీయాంశంగా మారాయి. తాజా వైమానిక విన్యాసాల్లో మరో తేజస్ విమానం కుప్పకూలడంతో భారత వైమానిక దళం (IAF) దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం సేవలో ఉన్న తేజస్ విమానాలపై విస్తృత సాంకేతిక తనిఖీలు చేపట్టినట్లు వర్గాలు తెలిపాయి.
Read Also:IDFC First Bank Scam: భారీగా పతనమైన IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లు
ఈ నెల ప్రారంభంలో సాధారణ శిక్షణా కార్యక్రమం అనంతరం ల్యాండింగ్ సమయంలో తేజస్ జెట్ ప్రమాదానికి గురైంది. ప్రాథమిక అంచనా ప్రకారం సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆన్బోర్డ్ వ్యవస్థల్లో లోపం ఉండవచ్చని వైమానిక దళ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రమాదం తర్వాత భద్రతా చర్యలలో భాగంగా దాదాపు 30 సింగిల్-సీట్ తేజస్ విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా కుప్పకూలిన విమానం ఎయిర్ఫ్రేమ్ తీవ్రంగా దెబ్బతినడంతో సేవ నుంచి తొలగించే యోచనలో ఉన్నారు. అయితే పైలట్ సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించే విషయం. ఇది ఐఏఎఫ్లో చేరిన తర్వాత తేజస్ జెట్లకు మూడో ప్రమాదం. 2024 మార్చిలో జైసల్మేర్ సమీపంలో తొలి ఘటన, 2025 నవంబర్లో దుబాయ్ ఎయిర్షోలో రెండో ఘటన జరిగింది. తాజాగా మూడోసారి ప్రమాదం జరగడంతో భద్రతపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: