రాష్ట్రంలోని వైన్ షాపుల్లో మద్యం బాటిళ్లపై నిర్ణయించిన ధర (MRP) కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్రంగా స్పందించారు. నిబంధనలను అతిక్రమించి అధిక ధరలకు మద్యం అమ్మడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇటువంటి చర్యలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు.
Read also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్
యాజమాన్యాలపై కఠినమైన చర్యలు
ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే విక్రయాలు సాగాలని దుకాణదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో మద్యం విక్రయాలను నిరంతరం పర్యవేక్షించాలని మరియు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలితే సంబంధిత యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: