📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Madhya Pradesh Road Accident: బస్సు – వ్యాన్ ఢీకొని నలుగురు మృతి.. 7గురికి గాయాలు

Author Icon By Tejaswini Y
Updated: February 21, 2026 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Madhya Pradesh Road Accident: మధ్యప్రదేశ్‌లో శనివారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. బింద్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 719పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

Read Also: IT Ride : ఐటీ రైడ్లో సీక్రెట్ రూమ్.. రూ.కోట్ల విలువైన బంగారం!

Madhya Pradesh Road Accident: Four killed, 7 injured in bus-van collision

అతివేగమే ప్రమాదానికి కారణం?

బింద్ జిల్లా(Bhind District) చిమ్కా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక వ్యాన్‌ను, అతివేగంగా వచ్చిన బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ నుజ్జునుజ్జు కావడంతో, అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bhind District Bus Accident Madhya Pradesh Madhya Pradesh Road Accident Road Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.