हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

HCU భూముల వివాదం.. ఢిల్లీలో హోర్డింగ్లు

Sudheer
HCU భూముల వివాదం.. ఢిల్లీలో హోర్డింగ్లు

రాహుల్ గాంధీ జీ… దయచేసి తెలంగాణలో మా అడవులను నరికివేయడం ఆపండి” అనే వాక్యంతో ఢిల్లీలో పలుచోట్ల హోర్డింగ్లు వెలిశాయి. జింక కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించే బొమ్మతో రూపొందించిన ఈ హోర్డింగ్లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ హోర్డింగ్లను బీజేపీ నేత తజిందర్ బగ్గా ఏర్పాటు చేయడం ద్వారా ఇది రాజకీయ రీతిలోనూ చర్చనీయాంశమైంది.

గచ్చిబౌలిలో భూవివాదం

హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలో ఉన్న సుమారు 400 ఎకరాల HCU భూమిని ప్రభుత్వం అభివృద్ధి పేరుతో విక్రయించేందుకు చదును పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతం ఎన్‌విరాన్‌మెంట్‌గా ఎంతో కీలకమైనదిగా పరిగణించబడుతోంది. అయితే అక్కడ ఉన్న చెట్లు తొలగించడం వల్ల ప్రాణుల నివాసానికి ప్రమాదం ఏర్పడిందని పలువురు ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.

HCU lands Delhi
HCU lands Delhi

వన్యప్రాణుల మనుగడపై ముప్పు

ఈ భూముల చుట్టూ వందలాది జింకలు, పక్షులు, మరెన్నో వన్యజీవులు నివసిస్తున్నాయి. చెట్లు తొలగించడంతో వాటి జీవనశైలి దెబ్బతిన్నదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. అడవి ప్రదేశాలను చేను చేయడం వల్ల జంతువులకు మిగిలే ప్రదేశం లేదు. జింకలు నివాస ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందని వారు చెబుతున్నారు.

పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలి

ఈ పరిణామాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అవసరమే అయినా, పర్యావరణ సమతుల్యతకు భంగం కలిగించకుండా ముందుకెళ్లాలి. వన్యప్రాణులకు హాని కలిగించే పనులను పునఃపరిశీలించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ భూముల విషయంలో పారదర్శకత పాటించి, సమగ్ర దర్యాప్తుతో ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870