ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ (Greta Thunberg) గాజాకు మానవతా సాయం తీసుకెళ్లే ప్రయత్నంలో ఇజ్రాయెల్ నావికాదళం (Israeli Navy) అడ్డుకుంది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మానవతా సంక్షోభాన్ని హైలైట్ చేయాలన్న తపనతో ఆమె చేపట్టిన యాత్ర ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.బ్రిటిష్ జెండాతో సాగిన ‘మాడ్లీన్’ నౌకలో గ్రెటాతో పాటు మరో 11 మంది వలంటీర్లు ఉన్నారు. వీరంతా గాజాలోని నిరుపేదల కోసం పాలపొడి, ఆహారం, మెడికల్ కిట్లు తీసుకెళ్తున్నారు. సిసిలీ నుంచి బయలుదేరిన ఈ నౌక, లిబియాలో నాలుగు వలసదారులను కూడా రక్షించింది.నౌక గాజాకు చేరతన్న తరుణంలో, అంతర్జాతీయ జలాల్లో ఇజ్రాయెల్ నౌకలు చుట్టుముట్టాయి. గ్రెటా తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వారిని క్షేమంగా ఉంచామనీ, తాము నీరు, శాండ్విచ్లు ఇచ్చామని ఇజ్రాయెల్ పేర్కొంది. వారికి స్వదేశాలకు పంపించనున్నట్లు చెప్పింది.
ఫ్లోటిల్లా నిర్వాహకుల ఆరోపణలు: ఇది కిడ్నాప్
ఇజ్రాయెల్ చర్యను ‘కిడ్నాప్’గా ఫ్లోటిల్లా సంస్థ అభివర్ణించింది. ఇంతవరకూ మేము మానవతా సేవ చేస్తూనే ఉన్నాం. గ్రెటా ముందుగానే ఓ వీడియో సందేశం పంపించారు. ప్రపంచం మద్దతు ఇవ్వాలి అంటూ పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్ స్పందన: ప్రచార యత్నం మాత్రమే
ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం ఈ యాత్రను ‘ప్రచార స్టంట్’గా తిప్పికొట్టింది. హమాస్కి ఆయుధాలు వెళ్లకుండా నిరోధించేందుకే దిగ్బంధన విధించినట్టు పేర్కొంది. రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, ఆ నౌక గాజా తీరానికి చేరదు. దీన్ని హమాస్ పక్షపాత చర్యగా చూస్తున్నాం అన్నారు.
ఐక్యరాజ్యసమితి హెచ్చరికల నేపథ్యంలోని ఘటన
గత రెండు నెలలుగా గాజాకు సహాయం నిలిచిపోయింది. భోజనం, నీరు, మెడికల్ సప్లైలు లేవు. ప్రజలు కష్టాల్లో ఉన్న ఈ సమయంలో ఇజ్రాయెల్ వ్యవహారం తీవ్రంగా విమర్శించబడుతోంది. యుద్ధం కన్నా ముందుగా మానవత్వం ముందుండాలన్న గొంతు పెరుగుతోంది.
Read Also : Errol Musk : ట్రంప్ ,ఎలాన్ మస్క్ వివాదం పై ఎలాన్ తండ్రి ఎర్రోల్ మస్క్ స్పందన