KTR

గవర్నర్ తన హోదా, స్థాయిని మరిచి ప్రసంగం : కేటీఆర్

హైదరాబాద్‌ : ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తెలంగాణ గవర్నర్‌ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా నది జలాలలో తెలంగాణ వాటాను తమ ప్రభుత్వం సాధించినట్లుగా గవర్నర్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్ పెద్ద మనిషిగా అసెంబ్లీలో ప్రస్తావిస్తారని ఆశపడిన బీఆర్ఎస్ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలు నిరాశ చెందారని కేటీఆర్ అన్నారు.

Advertisements
గవర్నర్ తన హోదా స్థాయిని

బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన

గవర్నర్ తన హోదా, స్థాయిని మరిచి ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. రాష్ట్రంలో రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్‌ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వడం లేదని నినాదాలు చేశారు. సంపూర్ణ రుణ మాఫీ చేయాలని, రైతులకు పంట బోనస్‌ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన, నిరసన మధ్యే గవర్నర్‌ ప్రసంగం కొనసాగింది.

కేసీఆర్ హయాంలో 56 శాతం ఉన్న బీసీలు

బీసీ కులగణనపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్సీనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 56 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు ఎందుకు తగ్గిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి తెలంగాణ తల్లి అంటున్నారు. రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ లో పెట్టారు. మూడేళ్ల తరువాత మేం అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్‌కు పంపిస్తాం అని కేటీఆర్ అన్నారు.

Related Posts
KTR: హైడ్రా ఓ డ్రామా: కేటీఆర్
KTR: హైడ్రా ఓ డ్రామా: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!

హైడ్రా పేరుతో రాష్ట్రంలో వసూళ్ల దందా నడుస్తోందని, అందుకు ప్రభుత్వంలోని పెద్దలు సూత్రధారులని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. Read more

Raghurama: జెత్వానీ కేసులో ఉన్న స్పీడ్ నా కేసులో ఉండాలి:రఘురామ
Raghurama: జెత్వానీ కేసులో ఉన్న స్పీడ్ నా కేసులో ఉండాలి:రఘురామ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలకంగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి Read more

Aghori : అఘోరికి 14 రోజుల రిమాండ్
Aghori : అఘోరికి 14 రోజుల రిమాండ్

Aghori : అఘోరికి 14 రోజులు రిమాండ్: కంది జైలుకు తరలింపు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా అఘోరి అలియాస్ Read more

YCPvsTDP: కూటమి తాజా ప్లాన్ తో వైసీపీ పరేషాన్
AndhraPradesh: కూటమి తాజా ప్లాన్ తో వైసీపీ పరేషాన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అఖండ విజయాన్ని సాధించినా, స్థానిక సంస్థలపై ఇప్పటికీ తమ పట్టు Read more

Advertisements
×