Government is fully responsible for this incident: Harish Rao

ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే : హరీశ్ రావు

కాంగ్రెస్ కమీషన్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపాటు

హైదరాబాద్‌: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులను మొదలు పెట్టి ప్రారంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనని దుయ్యబట్టారు. అంతేకాదు.. మొన్న సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలిన ఘటన నేడు ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలడం కాంగ్రెస్ కమిషన్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే

ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు

ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని గత నాలుగు రోజులుగా కొద్ది కొద్దిగా మట్టి కూలుతున్నదని గత నాలుగు రోజులుగా కొద్ది కొద్దిగా మట్టి కూలుతున్నదని గుర్తించినప్పటికీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలడంతో పనికి వెల్లిన వారిలో 8 మంది ఇరుక్కుపోయినట్టు సమాచారం. ఈ ఘటన పై ట్విట్టర్ వేదిక పై స్పందించారు హరీశ్ రావు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

సొరంగంలో ఇరుక్కుపోయిన వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని.. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలని కోరారు. వెంటనే డీ-వాటరింగ్ చేసి, విద్యుత్‌ను పునరుద్ధరించి, శిథిలాలను తొలగించి కార్మికులను వెంటనే బయటకు తీసుకు రావాలని హరీశ్ రావు అన్నారు. ఈ ప్రమాద ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Related Posts
OCల సంఖ్యను కేసీఆర్ ఎక్కువగా చూపారు – సీఎం రేవంత్
CM Revanth condemns attacks on houses of film personalities (1)

తెలంగాణలో ఓసీల సంఖ్యపై మాజీ సీఎం కేసీఆర్ తప్పుడు గణాంకాలు చూపించారని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత పాలనలో కేసీఆర్ ఓసీల సంఖ్య 21 Read more

రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు
Lucknow court summons Rahul Gandhi

రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు.సైన్యాన్ని రాహుల్ అవమానించారంటూ బీఆర్‌వో మాజీ డైరెక్టర్ ఫిర్యాదు.న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత మరియు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ Read more

ప్రధానికి హృదయపూర్వక స్వాగతం: పవన్ కళ్యాణ్
Warm welcome to Prime Minister.. Pawan Kalyan

అమరావతి: నేడు ఏపీలోని విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. Read more

ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కోర్ట్ లో జగన్ పిటిషన్…
ys Jagan will have an important meeting with YCP leaders today

తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోర్ట్ ను ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి Read more