తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు సేవ చేస్తున్న కార్యకర్తల కోసం (For activists) మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) శుభవార్త చెప్పారు. వారిని ఆదుకోవడానికి తన సొంత నిధి నుండి ఏటా రూ.10 కోట్ల మేర కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిధిని కార్యకర్తల సంక్షేమానికి వినియోగిస్తామని తెలిపారు.నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ తన సతీమణి రమాదేవితో కలిసి 175 మంది కార్యకర్తలకు రూ.45 లక్షల చెక్కులు అందించారు. ఐదేళ్లలో మొత్తం రూ.50 కోట్లు కేటాయించాలని నిర్ణయించారన్న సంగతి వెల్లడించారు.తన విజయంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమైందని మంత్రి తెలిపారు. వారి సహకారానికి కృతజ్ఞతగా సదా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏ చిన్న సమస్య వచ్చినా 24 గంటలూ అందుబాటులో ఉంటానని స్పష్టంగా చెప్పారు.

నెల్లూరు అభివృద్ధికి పక్కా యాక్షన్ ప్లాన్
నెల్లూరు సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైందన్నారు. నగరంలో రోడ్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇకపై స్వీపింగ్ యంత్రాలతో రోడ్లు శుభ్రం చేయనున్నట్లు తెలిపారు.నగర శుభ్రత కోసం 28 యంత్రాలను నెల్లూరు మున్సిపాలిటీకి అందించినట్టు మంత్రి వెల్లడించారు. వీటి సహాయంతో శుభ్రత పనులు మరింత మెరుగ్గా జరుగుతాయని తెలిపారు.
ఇళ్ల పట్టాల పంపిణీకి కసరత్తు
నెల్లూరు ప్రాంతానికి చెందిన 5 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాలన్నదే తన ప్రధాన లక్ష్యమని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రజల అవసరాలపై పూర్తి దృష్టి పెట్టి పనిచేస్తానని స్పష్టంచేశారు.పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఇది తాను వారి మీద కలిగిన బాధ్యతగా భావిస్తున్నట్టు నారాయణ చెప్పారు.
Read Also : Indirammas Houses : ఇందిరమ్మ ఇండ్లకు రోజుకో నిబంధన తెరపైకి