ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ (Gita Gopinath) త్వరలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం ఆమె IMFలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (DMD) హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే వచ్చే ఆగస్టు (AUG) లో ఆమె పదవికి రాజీనామా చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. IMFలో తన సేవలు ముగించుకుని గీతా మళ్లీ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా తన అకడమిక్ జీవితాన్ని కొనసాగించనున్నారని తెలుస్తోంది.
IMFలో తొలి మహిళా చీఫ్ ఎకానమిస్ట్
గీతా గోపీనాథ్ 2019లో IMF చీఫ్ ఎకానమిస్ట్గా నియమితులయ్యారు. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక విధానాలు రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2022లో IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలోకి ప్రమోట్ కావడం ద్వారా ఆమె మరో మైలురాయి సాధించారు. గ్లోబల్ పాండమిక్, ఆర్థిక మాంద్యం వంటి క్లిష్ట పరిస్థితుల్లో IMFకు మార్గదర్శకత్వం ఇచ్చారు.
హార్వర్డ్కు తిరిగివెళుతున్న గీతా
గీతా గోపీనాథ్ అకడమిక్ రంగంలోనే గణనీయమైన సేవలు అందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. IMFలో చేసిన సేవల అనంతరం ఆమె మళ్లీ హార్వర్డ్ యూనివర్సిటీలో అధ్యాపక బాధ్యతలు స్వీకరించనున్నారు. గీతా విశ్లేషణాత్మక ఆలోచనలు, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ఆమె అవగాహన హార్వర్డ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. IMFలో ఆమె చూపిన నైపుణ్యం, నాయకత్వం ప్రపంచ ఆర్థిక రంగంలో చిరస్మరణీయంగా నిలిచే అవకాశముంది.
Read Also : Betting Apps Promotion : రానా, దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మిలకు ఈడీ నోటీసులు!