Minister Ponnam Prabhakar : గాంధీ కుటుంబం కక్ష సాధింపులకు గురవుతుంది: మంత్రి పొన్నం

Read Time:  1 min
Gandhi family is vulnerable to partisan attacks.. Minister Ponnam
Gandhi family is vulnerable to partisan attacks.. Minister Ponnam
FONT SIZE
GET APP

Minister Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. దేశాభివృద్ధి కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం కక్ష సాధింపులకు గురవుతోందని అన్నారు. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని బలహీనపరచాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపే అన్నారు.

గాంధీ కుటుంబం కక్ష సాధింపులకు

రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు

సీబీఐ, ఈడీపై ఆధారపడి బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోంది. మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా ఆ పార్టీ వాళ్లు మాట్లాడలేదు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణి మంచిది కాదు. దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

గాంధీ కుటుంబాన్ని బధనామ్ చేస్తున్నారు

కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుంటే చూసి ఓర్వలేక అది నాయకత్వాన్ని ఈడీ కేసుల పేరుతో, చార్జిషీట్ ల పేరుతో ఇబ్బందులు పేడుతుందని మండిపడ్డారు. అంతేగాక నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వతంత్ర్యం కోసం పని చేసిందని, దేశంలో గాంధీ కుటుంబమే ఆస్తులను సంపాదించాలని అనుకుంటే.. వందల మంది ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులను చేసిన వాళ్ళు అవినీతికి పాల్పడకపోయేవారా అని ఫైర్ అయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబాన్ని బధనామ్ చేస్తున్నారు..అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు !

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.