బెంగళూరు: కర్ణాటక బీజేపీ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి నియామకం కానున్నట్లు సమాచారం అందుతోంది. బీజేపీ హైకమాండ్ అధినేత అమిత్ షా బెంగళూరు పర్యటన సందర్భంగా ముఖ్యమైన చర్చలు జరిగాయని టాక్ అందుతోంది. అమిత్ షా తనను కలవడానికి జనార్ధన రెడ్డిని మాత్రమే ఎందుకు అనుమతించారు? అనే చర్చ జరుగుతోంది.

మరి మాజీ మంత్రి శ్రీరాములు పరిస్థితి ఏంటి..?
మరెవరినీ ఎందుకు అనుమతించలేదు..? అంటూ కర్ణాటక బీజేపీ పార్టీలో చర్చ జరుగుతోంది. గాలి జనార్ధన్ రెడ్డి, అమిత్ షాతో సులభంగా సమావేశమై చర్చించడం బీజేపీలో కొత్త చర్చలకు దారితీసింది. మరి మాజీ మంత్రి శ్రీరాములు పరిస్థితి ఏంటి..? రాజీనామా చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. ఈ తరుణంలోనే… కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి నియామకం కానున్నట్లు సమాచారం అందుతోంది.
ఈ నియామకంతో కర్ణాటకలో బీజేపీకి పెద్ద మార్పు
కాగా, గాలి రెడ్డి గతంలో రాష్ట్రంలో తీవ్ర రాజకీయ కుంభకోణాలకు కారణమయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరడం ద్వారా పార్టీకి కీలకమైన నాయకుడిగా మారారు. మైసూరు ప్రాంతంలోని రాజకీయ పరిసరాల్లో ఆయన ప్రభావం చాలా పెరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీకి ఆయన సపోర్టు మూలంగా బలమైన శక్తిని అందించారు. ఈ నియామకంతో కర్ణాటకలో బీజేపీకి పెద్ద మార్పు జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్లమెంట్ సభ్యులు, ఇతర పార్టీ నాయకులు కూడా గాలి రెడ్డి నాయకత్వాన్ని స్వాగతించారు.