రేపటి నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ

అక్టోబర్ 3 నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ఫేజ్లో హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో చేపపిల్లల పంపిణీ చేస్తారు. ఆ తర్వాత 7వ తేదీ మిగతా జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, MLAలు, MLCలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని మంత్రి పొన్నం కోరారు.