మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయన సాధారణ ఖైదీలలాగే ఉండాలనే పరిస్థితిని అంగీకరించడం లేదు. జైలులో తనకు ప్రత్యేక వసతులు కావాలని విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.మిథున్ రెడ్డి రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు (Filing of different petitions) చేశారు. వాటిలో ఆయన చేసిన డిమాండ్లు ఒక్కొక్కటిగా చూస్తే ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ఇంటి మాదిరి అల్పాహారం, మూడు పూటల హోం ఫుడ్, కిన్లే వాటర్ బాటిల్స్, కొత్త పరుపు, కొత్త దిండు కావాలని కోరారు.

ప్రత్యేక గది, టీవీ, సహాయకుడూ కావాలట
జైలులో వెస్ట్రన్ కమోడ్తో కూడిన ప్రత్యేక గది, ఆ గదిలో ఓ టీవీ, సేవలు అందించే వ్యక్తి ఉండాలని కూడా కోరారు. దినపత్రికలు, వాకింగ్ షూలు, దోమల తెర కూడా లిస్టులో ఉన్నాయి. ఇది చూస్తే, ఓ రాజకీయ నాయకుడికి జైలు కూడా వీఐపీ సూట్లా ఉండాలనే భావన స్పష్టంగా కనిపిస్తోంది.మిథున్ రెడ్డి కోరిన మరో భాగం – యోగా మ్యాట్, ప్రొటీన్ పౌడర్, గదిలో టేబుల్, తెల్లకాగితాలు, పెన్ను వంటి అవసరాలపై ఉండటం గమనార్హం. అంటే జైలులో ఉండే సమయంలో ఆరోగ్యం, రాతలపై దృష్టిపెట్టాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది.
కోర్టు స్పందన – జైలు అధికారులకు ఆదేశం
ఈ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. అభ్యంతరాలుంటే తెలియజేయాలని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఉదయం నేరుగా కోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని సూచించింది.మిథున్ రెడ్డి కోరికలు సామాన్య ఖైదీలకు అందని ప్రత్యేకతలు. ఇది రాజకీయం, శక్తి, హోదా – అన్నిటి కలయిక అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు చివరికి ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Read Also : Chandrababu Naidu: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం… చంద్రబాబు ఆదేశం