PSL 2025: పీఎస్‌ఎల్‌ క్రికెటర్లు బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం

PSL 2025: పీఎస్‌ఎల్‌ క్రికెటర్లు బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పి ఎస్ఎల్ ) 2025 సీజన్‌ శుక్రవారం,ప్రారంభం అయ్యింది,అయితే, టోర్నీ ప్రారంభానికి ముందు ఇస్లామాబాద్‌లోని హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ పీఎస్‌ఎల్‌ జట్టు క్రికెటర్లతో పాటు సిబ్బంది ఈ హోటల్‌లోనే బస చేశారు. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌లోని ఆరవ అంతస్తులో మంటలు చెలరేగాయని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. పీఎస్‌ఎల్‌ క్రికెటర్లు, సిబ్బందిని రక్షించారు. మంటల్లో ఎవరూ గాయపడలేదని.వారిని అక్కడి నుండి మరో చోటుకి తరలించినట్లు పేర్కొన్నారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. సీఎస్‌ఎల్‌ సీఈవో సల్మాన్‌ నసీర్‌ మీడియాతో మాట్లాడుతూ మంటలు హోటల్‌లోకి ప్రవేశించలేదన్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ఆరు ఫైర్‌ ఇంజిన్లు, 50 మంది సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అరగంటలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు సీడీఏ అత్యవసర డైరెక్టర్ జాఫర్ ఇక్బాల్ పేర్కొన్నారు.

Advertisements

పీఎస్‌ఎల్‌ మ్యాచులు

2025 తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ లాహోర్ ఖలందర్స్‌తో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో తలపడింది. ఐపీఎల్‌ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ తొలి మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించింది. ఐపీఎల్‌ నేపథ్యంలో రాత్రి 8 గంటలకు పీఎస్‌ఎల్‌ మ్యాచులు మొదలవుతాయని పీఎస్‌ఎల్‌ సీఈవో సల్మాన్‌ నసీర్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌ లీగ్‌లు మొదలైనప్పటి నుంచి ఒకే విండోలో తలపడడం ఇదే తొలిసారి. బిజీ క్యాలెండర్‌ నేపథ్యంలో ఏప్రిల్‌-మే విండోలో పీఎస్‌ఎల్‌ని షెడ్యూల్‌ చేయడం తప్ప మరో మార్గం లేదని నసీర్‌ పేర్కొన్నారు. ఇది మంచిది కాదని. అయితే, పీఎస్‌ఎల్‌ అభిమానులను ఆకర్షిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌ ఒకేసమయంలో కొనసాగుతుండడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఐపీఎల్‌ వేలంలో అమ్ముడవకుండా మిగిలిపోయిన కొందరు విదేశీ స్టార్స్‌ పీఎస్‌ఎల్‌ ఆడేందుకు ఒప్పందం చేసుకున్నారు. వచ్చే ఏడాది లీగ్‌లోకి మరో రెండు జట్ల చేర్చాలని భావిస్తున్నట్లు పీఎస్‌ఎల్‌ సీఈవో పేర్కొన్నారు.

వార్నర్ నాయకత్వం

హసన్, తన ఉత్సాహంతో పాటు జట్టుపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ఈ సీజన్‌లో తమ ప్రదర్శన మళ్లీ చర్చకు వస్తుందని తెలిపాడు. నేషనల్ బ్యాంక్ స్టేడియంలో తమ ఆతిథ్యపు మ్యాచ్‌లు అభిమానులకు నిజమైన విజువల్ ట్రీట్‌గా ఉండబోతాయని హామీ ఇచ్చాడు.కరాచీ కింగ్స్ జట్టును పరిశీలిస్తే, వారు ఈసారి బలమైన యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. డేవిడ్ వార్నర్ నాయకత్వంలో, హసన్ అలీ, ఆడమ్ మిల్నే, అబ్బాస్ అఫ్రిది లాంటి గట్టి పేసర్లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో జేమ్స్ విన్స్, కేన్ విలియమ్సన్, లిట్టన్ దాస్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఈ సమతుల్యమైన స్నేహితులతో కింగ్స్ జట్టు ప్రతిసారీ గెలుపు కోసం పోరాడనుంది.

Read Also: Mohammad Rizwan:తన ఇంగ్లీష్ భాషపై ట్రోలింగ్ స్పందించిన పాకిస్థాన్ కెప్టెన్ రిజ్వాన్

Related Posts
ఘనంగా పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ప్రారంభం
Grand opening of Poultry India Exhibition

హైదరాబాద్‌లో నేటి నుండి 29 వరకు 16వ ఎడిషన్ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో హైదరాబాద్: దక్షిణాసియాలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన ప్రారంభం. ఈ Read more

హోలీ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు – సీఎం రేవంత్ రెడ్డి

దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా – పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మిత్రులు, కుటుంబ సభ్యులు, పొరుగు Read more

Donald Trump: విదేశీ విద్యార్థులపై AI నిఘా.. చిన్న లైక్‌ కొట్టినా ఇంటికే!
విదేశాలకు తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

విదేశీ విద్యార్థులపై అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​-ఏఐతో నిఘా పెడుతోంది. హమాస్‌ అనుకూల ఉగ్రవాద గ్రూపులకు సపోర్డ్ చేస్తున్న విదేశీ విద్యార్థులను గుర్తించడానికి, వారిపై నిఘా పెట్టడానికి ట్రంప్ Read more

Sheikh Hasina: షేక్ హసీనాను విమర్శిస్తే రహస్య జైలులో భయానక శిక్ష
షేక్ హసీనాను విమర్శిస్తే రహస్య జైలులో భయానక శిక్ష

అధికారులు ఆ గోడను బద్దలు చేసినప్పుడు, దాని వెనుక వారికో రహస్య కారాగారం కనిపించింది. బయటి ప్రపంచానికి కనిపించకుండా, ఈ జైలు ద్వారాన్ని హడావుడిగా ఇటుకరాళ్లతో గోడలా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×