ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ (Murali Nayak) కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరామర్శించింది. సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ తల్లిదండ్రులను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తంకెళ్ల సవిత కలసి పరామర్శించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగం నిలచిపోయేదికాదని, కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి తెలిపారు.
ఆర్థిక సహాయంగా రూ. 50 లక్షల చెక్కు
వీరజవాన్ మురళీ తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల ఆర్థిక సహాయ చెక్కును మంత్రి సవిత అందజేశారు. అంతేకాకుండా, కుటుంబానికి భవిష్యత్తులో ఆదాయాధారంగా నిలిచేందుకు ఐదు ఎకరాల భూమి పట్లను కూడా అప్పజెప్పారు. వీటితోపాటు, నివాస అవసరాల కోసం ఆరు సెంట్ల ఇంటి స్థలం పత్రాలను కూడా ప్రభుత్వం అందించింది. ఈ చర్యలన్నీ మురళీ తల్లిదండ్రుల్లో కాస్త నెమ్మదిని కలిగించాయి.
ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
వీరమరణం పొందిన మురళీ త్యాగానికి విలువ కలిగించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుంటుందని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. మురళీ కుటుంబం కోసం ప్రభుత్వం మరిన్ని పునరావాస అవకాశాలు కూడా పరిశీలిస్తోందని సమాచారం. వీరజవాన్ల త్యాగానికి ఇది ఒక చిన్న గుర్తింపుగా భావించవచ్చని ఆమె అన్నారు.
Read Also : Tet Exams : నేటి తెలంగాణ లో నుంచి టెట్ పరీక్షలు