యాద్గిర్ జిల్లాలోని జాలిబెంచి గ్రామంలో మంగళవారం రాత్రి అకస్మాత్తుగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే స్తంభాలపై ఒక్కసారిగా మెరుపులు, మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ తరహాలో వైర్లు అంటుకున్నాయి.దీంతో గ్రామంలోని సుమారు వంద ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైపోయాయి.షార్ట్ సర్క్యూట్ కారణంగా కొన్ని ఇళ్లల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు గ్రామస్థులు గాయపడ్డారు.గ్రామస్థులు భయాందోళనకు గురై స్థానిక సబ్ స్టేషన్ కు సమాచారం అందించారు.పూర్తి వివరాలు,
సోషల్ మీడియా
ఘటన జరిగిన వెంటనే భయభ్రాంతులకు గురైన గ్రామస్థులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తమ ఇంట్లోని సామగ్రి రక్షించుకోవడానికి ప్రయత్నించారు. విద్యుత్ స్తంభాల నుంచి మంటలు రావడం చూసిన వారు వెంటనే స్థానిక సబ్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు.స్పందించిన అధికారులు వెంటనే గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హుటాహుటిన గ్రామానికి చేరుకుని విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా కాలిపోయిన స్విచ్ బోర్డులు, మాడిపోయిన ఫ్యాన్లు, పాడైపోయిన టీవీలు, ఫ్రిడ్జ్ లు కనిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్థులు రికార్డు చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే వైర్లు చాలా పాతవైనందువల్లే ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.మంగళవారం రాత్రి వీచిన బలమైన గాలుల వల్లే విద్యుత్ తీగలు ఒకదానికొకటి తాకి ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే లైన్లు కూడా పురాతనమైనవని చెప్పారు. వీలైనంత తొందరగా మరమ్మతులు చేసి గ్రామానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
అయితే విద్యుత్ శాఖ అధికారులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ ఎలా సంభవించిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను రూపొందించి సంబంధిత శాఖలకు అందజేయనున్నట్లు తెలిపారు.గ్రామాల్లో విద్యుత్ నిర్మాణాల్లో నాణ్యతపై మరింత దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
Read Also: Tamilasai: తమిళిసై తండ్రి కన్నుమూత