Congress : ఓటమి భయంతో ఎన్నికలు నిర్వహించట్లేదు – హరీశ్ రావు

Read Time:  1 min
Congress : ఓటమి భయంతో ఎన్నికలు నిర్వహించట్లేదు – హరీశ్ రావు
FONT SIZE
GET APP

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను (Local Body Elections) నిర్వహించకపోవడంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను మళ్లీ మళ్లీ వాయిదా వేస్తోందని ఆరోపించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తేటతెల్లంగా చూసిన ప్రభుత్వం, ఓటమిని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తగిన చర్య కాదని హరీశ్ విమర్శించారు.

పథకాలపై బహిరంగ చర్చకు సవాల్

రాష్ట్రంలో తాము అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమని హరీశ్ రావు స్పష్టం చేశారు. “ఎక్కడికి రమ్మంటారో చెప్పండి – మేము వస్తాం. ప్రజల ముందు నిజాలు చెప్పుకుందాం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌కు సవాల్ విసిరారు. తాము చేసిన పని గురించి ధైర్యంగా మాట్లాడగలగుతామని, కానీ కాంగ్రెస్ నేతలు అబద్ధాలకే మాత్రమే ఆధారపడుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్ పునఃరాగమనానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు

హరీశ్ రావు మాట్లాడుతూ, “ప్రజలు మరోసారి కేసీఆర్‌ను సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఆయనే బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని అందించారు” అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అబద్ధాల బాట పట్టిన రేవంత్‌కు మహేశ్ కుమార్ పోటీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు.

Read Also : MP Raghunandan Rao : ఇరిగేషన్ అధికారులపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.