తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

Read Time:  1 min
election commission of tela
election commission of tela
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 10 ఎమ్మెల్సీ (ఎమ్మెల్యే కోటా) స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుండగా, తెలంగాణలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా మార్చి నెలాఖరుతో ముగియనుంది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు మార్చి 3న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

EC

మార్చి 11న నామినేషన్ల పరిశీలన

ఎన్నికల ప్రక్రియ ప్రకారం, మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. మార్చి 11న నామినేషన్ల పరిశీలన జరిపి, మార్చి 13వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఎన్నికలు మార్చి 20న నిర్వహించనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత ఇదే తొలి ఎమ్మెల్సీ ఎన్నికలు

ఈ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం అధికార కూటములు మరియు విపక్షాలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత ఇదే తొలి ఎమ్మెల్సీ ఎన్నికలు కావడం విశేషం. మరి ఈ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఎవరి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయో చూడాలి.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.