unnamed file

ముఖ్యమంత్రి రేసు నుంచి ఏక్‌నాథ్‌ శిండే వైదొలుగుతున్నారా?

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి తరఫున సీఎం పదవి చేపట్టనున్నారనే సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతున్నది. మహారాష్ట్ర 14వ అసెంబ్లీ పదవీ కాలం నేటితో (మంగళవారం) ముగియనున్నది. దీంతో ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిని అధికారులు ఖండించినప్పటికీ.. తదుపరి సీఎం అభ్యర్థి ఎవరు కాబోతున్నారనేది కూటమి ఇంకా తేల్చకోలేకపోతున్నది. బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆపార్టీ హైకమాండ్‌తో పాటు రాష్ట్ర నాయకత్వం అంటుండగా.. ‘బీహార్‌ ఫార్ములా’ ప్రకారం ఏక్‌నాథ్‌ శిండేను కొనసాగించాలని శివసేన పట్టుబడుతున్నది. ఈ సస్సెన్స్‌ కొనసాగుతున్న సమయంలోనే సీఎం శిండే పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. దీంతో ఆయన సీఎం రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Advertisements

మంగళవారం తెల్లవారుజామున ఏక్‌నాథ్‌ శిండే తన సోషల్‌ మీడియా ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించడంతో మా ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నది. మహాకూటమిగా మేం ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం. నేటికీ కలిసే ఉన్నాం. నాపై ప్రేమతో కొన్ని సంఘాల వారు నన్ను కలవడానికి ముంబయి వస్తామని అడుగుతున్నారు. వారి అభిమానానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిజేస్తున్నాను. అయితే నాకు మద్దతుగా అలా ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. బలమైన, సుసంపన్న మహారాష్ట్ర కోసం మహాకూటమి బలంగా ఉన్నది. అలాగే కొనసాగుతుంది కూడా’అని శిండే రాసుకొచ్చారు. దీంతో ముఖ్యమంత్రి రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఆయన సూచనప్రాయంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో 288 సీట్లకు గాను.. 200 కు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అయితే.. మరాఠా గడ్డపై దేవెంద్ర ఫడ్నవీస్ సీఎం పదవీని అధిష్టిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు షిండే వర్గం మాత్రం.. సీఎం సీటును వదులుకొనేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం మహారాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారాయని చెప్పుకొవచ్చు.

Related Posts
పదేండ్ల కేసీఆర్‌ పాలనలో సుభిక్షంగా మారిన తెలంగాణ !
Telangana became prosperous under KCR rule for ten years!

వారి విమర్శలు ఉత్తవేనని ఈ లెక్కలు తేల్చియి హైదరాబాద్: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక-2024(అట్లాస్‌) పదేండ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధికి Read more

నిర్లక్ష్యానికి 13 నిండు ప్రాణాలు బలి
mumbai boat accident

ముంబై తీరంలో జరిగిన దారుణ బోటు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కలచివేస్తోంది. నీల్కమల్ ఫెర్రీ బోటు ప్రమాదానికి ప్రధాన కారణం నిర్లక్ష్యమే అని Read more

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేస్తున్న మమతా బెనర్జీ
Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేస్తున్న మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బ్రిటన్‌లో తన అధికారిక పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, పశ్చిమ Read more

గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
గవర్నర్ కీలక వ్యాఖ్యలు!

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజ్ భవన్ కు వెళ్లిన అతిశీ.. Read more

Advertisements
×