తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక తీర్మానం చేశారు. ఈ తీర్మానం ద్వారా తెలంగాణా ప్రభుత్వ స్టాండ్ ను ప్రకటించి, డీ లిమిటేషన్ విషయంలో కేంద్రంతో యుద్ధం ప్రకటించారు. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర వైఖరి మారాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజక వర్గాల పునర్విభజన - డీలిమిటేషన్ విధి విధానాలలో మార్పులు చేయాలని సూచించారు. శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ తీర్మానం శాసన సభలో డీ లిమిటేషన్ పై తీర్మానం ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు రాష్ట్రంలో శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభాలెక్కలకు అనుగుణంగా SC, ST స్థానాలను పెంచాలనీ కేంద్రాన్ని ఆయన కోరారు. డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లని విధంగా చేయాలని అభిప్రాయ పడ్డారు. నియోజక వర్గాల పెంపు పైన చర్చ దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ తో నష్టం కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, నియోజక వర్గాల పెంపు పైన చర్చ జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీని కారణంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదు గతంలో ఇందిరాగాంధీ ఆమోదించలేదన్న సీఎం రేవంత్ గతంలో ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక తాజాగా మరోమారు నియోజకవర్గాలు పునర్విభజన అంశం తెర మీదికి రావడంతో దక్షిణాది రాష్ట్రాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా అందరితో కలిసి కేంద్రానికి ఎదురుగా నిలబడి పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కడ్బందీగా కుటుంబ నియంత్రణ అమలు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై రేవంత్ ఆందోళన దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయని, ఫలితంగా రాష్ట్రాలకు నష్టం జరిగితే ఊరుకోబోమన్నారు. ప్రభుత్వ విధానాన్ని సమగ్రంగా అమలు చేసినందుకు తమకే బెనిఫిట్ జరిగేలా చూడాలన్నారు. ఒకవేళ ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చట్టసభలలో 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్ విషయంలో రేవంత్ డిమాండ్ ఇదే డీలిమిటేషన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని శాసన సభ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని ఆయన తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని డిమాండ్ చేశారు.

CM Revanth Reddy : తెలంగాణలో విద్యా రంగం క్షీణించిపోతోంది : సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణలో విద్యాశాఖపై సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిస్థాయిలో విద్యా రంగం రోజు రోజుకూ క్షీణించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో 3, 5 తరగతుల విద్యార్థులపై నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం 75శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదు. తెలంగాణ ర్యాంకు చివరి నుంచి ఐదో స్థానంలో ఉంది. 3వ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ పరిజ్ఞానంలో తెలంగాణ 36వ స్థానంలో ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అథమ స్థానంలో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలు చదవలేని పరిస్థితి. ప్రతి స్థాయిలో విద్యారంగం రోజు రోజుకూ క్షీణించి పోతోంది.

తెలంగాణలో విద్యా రంగం క్షీణించిపోతోంది

విద్యా రంగానికి భారీగా నిధులు

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11వేలకు పైగా టీచర్ల నియామకం చేపట్టాం. 21వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతులు కల్పించాం. ఏడెనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 36వేల మంది టీచర్ల బదిలీ చేపట్టాం. కలెక్టర్లనైనా బదిలీ చేయవచ్చు గానీ, టీచర్ల బదిలీ ఆషామాషీ కాదు. 36వేల మంది టీచర్లను చిన్న ఆరోపణలు లేకుండా బదిలీ చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులపై రూ.1.08లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నాం. ప్రైవేటులో రూ.50వేల వరకు ఖర్చయితే.. ప్రభుత్వ పాఠశాలల్లో రూ.లక్ష ఖర్చవుతోంది. బడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యమిస్తూ రూ.23,108 కోట్లు కేటాయించాం. విద్యా రంగానికి భారీగా నిధులు కేటాయించినా ప్రమాణాలు పడిపోతున్నాయి.

విద్యా ప్రమాణాల మెరుకు చర్యలు

ఇందుకు ప్రభుత్వమే కాదు.. సమాజం బాధ్యత తీసుకోవాలి. లోతుగా విశ్లేషించి సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ కోణంలో ఆలోచన చేసినంత కాలం విద్యారంగం ప్రక్షాళన కాదు. విద్య పట్ల ప్రత్యేక విధానం తీసుకురావాలనేది ప్రభుత్వ ఉద్దేశం. విద్యారంగం బలోపేతానికి సూచనల కోసం విద్యా కమిషన్‌ ఏర్పాటు చేశాం అన్నారు. గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో విద్యా ప్రమాణాల మెరుకు చర్యలు తీసుకుంటాం. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తేనే స్థానిక సంస్థల్లో పోటీకి, ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అవకాశంపై చర్చించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిని ప్రోత్సహించేలా చర్యలు ఉండాలి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Related Posts
మద్యం మాఫియాపై చంద్రబాబు విమర్శలు
మద్యం మాఫియాపై చంద్రబాబు విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ విజయాన్ని ఆయన చారిత్రాత్మకంగా పేర్కొంటూ, ప్రధాన Read more

Fever : ఒళ్లంతా జ్వరం పట్టినట్టు ఉంటోందా…?
boday pains

వారం రోజులుగా చాలామంది తీవ్రమైన శారీరక అస్వస్థతకు గురవుతున్నారు. తల తిరగడం, శరీరం తూలడం, కాళ్లు చేతులు లాగడం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటితో Read more

సంధ్య థియేటర్ తొక్కిసలాట.. మెరుగుపడ్డ శ్రీతేజ
sriteja

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. 'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ Read more

ఇంద్రకిలాద్రి అమ్మవారి చీరల స్కామ్ : హైకోర్టు కీలక ఆదేశాలు
Indrakeeladri Ammavari saree scam.. High Court issues key orders

విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో ఇంద్రకీలాద్రి లో 33,686 వేల చీరలు మాయం అయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన అధికారులు తీరు మారలేదని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *