ఈ-పాస్పోర్ట్ ఎప్పుడో వచ్చిన విషయమే. కానీ, ఇప్పుడు పూర్తిగా అమలు దశలోకి వచ్చింది. గతేడాది ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పాస్పోర్ట్ సేవా కార్యక్రమం (PSP) 2.0లో ఇది భాగం.ఇందులో భాగంగా దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ఈ-పాస్పోర్టుల పైలట్ జారీ ఇప్పటికే జరుగుతోంది. ఇందులో హైదరాబాద్, చెన్నై, రాంచీ, జమ్మూ, జైపూర్, సూరత్, అమృత్సర్, నాగ్పూర్, భువనేశ్వర్, గోవా, రాయ్పూర్, సిమ్లా నగరాలు ఉన్నాయి.

చెన్నై ముందడుగు వేసింది
చెన్నై ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఈ సేవలను మార్చిలో ప్రారంభించింది. ఒక్క తమిళనాడులోనే మార్చి 22 వరకు 20,729 ఈ-పాస్పోర్టులు జారీ అయ్యాయి. ఇది ప్రజల స్పందనను స్పష్టంగా చూపిస్తోంది.
ఈ-పాస్పోర్ట్ అంటే ఏంటి?
ఈ-పాస్పోర్ట్ సాధారణ పాస్పోర్ట్లా కాకుండా స్మార్ట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని కవర్లో చిన్న RF (రేడియో ఫ్రీక్వెన్సీ) చిప్ ఉంటుంది. ఆ చిప్లో వ్యక్తిగత biodata, బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి.ఈ చిప్ కారణంగా వేరిఫికేషన్ వేగంగా జరుగుతుంది. ప్రయాణ సమయంలో భద్రతా తనిఖీలు త్వరగా పూర్తవుతాయి. అంతేకాక, ఆర్ఎఫ్ఐడీ చిప్ వల్ల మిమ్మల్ని సులభంగా గుర్తించవచ్చు.
ప్రత్యేక గుర్తింపు ఎలా?
e-passport ముందు భాగంలో బంగారు రంగులో ఉన్న చిన్న చిహ్నం ఉంటుంది. అదే ఈ-పాస్పోర్ట్ గుర్తింపు. ఇది సాధారణ పాస్పోర్ట్తో తేడా చూపిస్తుంది.చిప్లోని డేటా సున్నితమైనది కావడంతో, దీన్ని పీకేఐ (Public Key Infrastructure) ఎన్క్రిప్షన్తో భద్రపరుస్తున్నారు. ఇది డేటా లీక్ అవకుండా కాపాడుతుంది.ప్రస్తుతం మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ చెల్లుబాటు అవుతుంది. గడువు ముగిసే వరకూ దాన్ని ఉపయోగించవచ్చు. తప్పనిసరిగా ఈ-పాస్పోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా స్వచ్ఛందమే.ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా సాగుతున్న ఈ సేవలు త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం ఇప్పటికే భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్ని నగరాల్లో ఈ-పాస్పోర్ట్ సౌకర్యం ప్రారంభమయ్యే రోజూ దూరం కాదు.
Read Also : Maoist encounter : కీలక ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మృతి!