ట్రంప్ సమక్షంలోనే నేతల గొడవలు..అలాంటివి లేవని వివరణ

ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన డోజ్ ఉద్యోగులు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో.. ఎలాన్ మస్క్‌కు అక్కడి ఉద్యోగులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ముఖ్యంగా ఫెడరల్ ఉద్యోగులను తొలిగించడాన్ని ఏమాత్రం సమర్థించలేకపోతున్న 21 మంది డోజ్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తాము అమెరికన్ ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే ప్రతిజ్ఞ చేశామని.. కానీ అన్యాయంగా సివిల్ సర్వీస్ ఉద్యోగులను తొలగిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వాటి కోసం తాము పని చేయలేమని వివరిస్తూనే రాజీనామా లేఖలను అందజేశారు.
ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తున్నారు
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర దేశాల నేతలను భయపెట్టడమే కాకుండా అమెరికా ప్రజలను సైతం ఆందోళనల్లోకి నెడుతున్నారు. ముఖ్యంగా అపరకుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో డోజ్ ఏర్పాటు చేసి.. దేశంలోనే అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తున్నారు.

Advertisements
ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన డోజ్ ఉద్యోగులు


సివిల్ సర్సీస్ ఉద్యోగులపై కూడా వేటు
అయితే వీటిలో 40 శాతం కాంట్రాక్టులు పూర్తి నిరుపయోగంగా ఉన్నాయని.. వీరి వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని వివరించింది. ఇందులో భాగంగానే ట్రంప్.. సివిల్ సర్సీస్ ఉద్యోగులను కూడా తొలగించాలని చూస్తున్నారు. కీలకమైన సివిల్ సర్సీస్ ఉద్యోగుల తొలగింపునకు తమ సాంకేతిక నైపుణ్యాలను వినియోగించలేమని చెబుతూనే.. డోజ్‌లో పని చేస్తున్న 21 మంది ఉద్యోగులు రాజీనామాలు చేశారు. ముఖ్యంగా వీరంతా తమ రాజీనామా లేఖల్లో.. మేం అమెరికన్ ప్రజలకు సేవ చేయడానికి ప్రతిజ్ఞ చేశామని.. అధ్యక్ష పాలనా వ్యవస్థల్లో రాజ్యాంగ విలువలను నిలబెడతమని ప్రమాణం చేశామంటూ రాసుకచ్చారు.
అంతేకాకుండా ఫెడరల్ ప్రభుత్వ సైజును తగ్గించేందుకు మస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డోజ్‌లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇలా ఒక్కసారిగా ఇంతమంది రాజీమానాలు చేయడం ఇటు మస్క్‌తో పాటు అటు ట్రంప్ నకు కూడా షాకేనని తెలుస్తోంది.

Related Posts
Trump and Zelensky: మరోసారి ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య గొడవ!
మరోసారి ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య గొడవ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్‌స్కీ మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. రష్యా- ఉక్రెయిన్‌ మధ్య మూడేళ్లకుపైగా సాగుతోన్న యుద్ధం ముగింపునకు చర్చలు Read more

Nirmala Sitharaman : జమిలి ఎన్నికలు 1.5 శాతం పెరుగుదల : నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman జమిలి ఎన్నికలు 1.5 శాతం పెరుగుదల నిర్మలా సీతారామన్

దేశంలో జమిలి ఎన్నికలపై చర్చలు మళ్లీ వేగం పెంచుతున్నాయి అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చెన్నైలో జరిగిన ఓ Read more

RRB: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే?
రైల్వే పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) తాజాగా లోకో పైలట్ CBT-2 పరీక్ష తేదీలను ప్రకటించింది. ఇదివరకు మార్చి 19వ తేదీన జరిగేలా షెడ్యూల్ చేసిన ఈ పరీక్షను Read more

Talking Crow: ఆప్యాయంగా పలకరిస్తున్న కాకి చూసేందుకు వస్తున్న జనం
Talking Crow: ఆప్యాయంగా పలకరిస్తున్న కాకి చూసేందుకు వస్తున్న జనం

మానవులను పోలిన కాకి మాటలు: పాల్ఘడ్‌ వింత కథ చిలుకలు గానీ, గోరింకలు గానీ మన మాటలు అనుకరిస్తాయని చాలామందికి తెలుసు. వాటిని చూశాం, వినటం సర్వసాధారణమే. Read more

Advertisements
×