ఉత్తరాఖండ్లోని(Uttarakhand) ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్లో ఉన్న 105 ఘాట్లకు హిందూయేతరుల ప్రవేశాన్ని పరిమితం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నిషేధాన్ని 2027 జనవరిలో జరగనున్న అర్ధ కుంభమేళా నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Devotional Wear: పూజలో ధరించాల్సిన సాత్విక రంగుల దుస్తులు

సాధువులు, గంగా సభ ప్రతినిధులు గత కొంతకాలంగా చేస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గంగా ఘాట్ల పవిత్రతను కాపాడటం, సంప్రదాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో రిషికేశ్, హరిద్వార్(Uttarakhand) నగరాలను ‘సనాతన్ పవిత్ర నగరాలు (Holy Cities)’గా ప్రకటించే యోచన కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ హోదా కల్పిస్తే, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు ప్రత్యేక నియమ నిబంధనలు అమలు చేసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఈ అంశంపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉండగా, ప్రతిపాదిత చర్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: