టెన్త్, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో(TTD) భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం స్వామి వారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి లేదు. ఈ రోజు తిరుమలలో భక్తుల రాకపోకలు సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Read Also:Mahashivaratri2026: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్
దర్శన టోకెన్లు లేకున్నా సాధారణ దర్శనం 5 నుంచి 6 గంటలలో పూర్తవుతోంది. ఇక రూ.300ల శీఘ్ర దర్శనానికి కేవలం 1 నుంచి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఉచిత దర్శనం కోసం భక్తులు ప్రస్తుతం నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం వివరాలు
నిన్న ఒక్కరోజులోనే 69,389 మంది భక్తులు(TTD) శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 20,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా మొత్తం రూ.3.72 కోట్ల ఆదాయం లభించింది. విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యే వరకు తిరుమలలో భక్తుల రద్దీ ఇలానే సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు ఇది అనుకూల సమయంగా భావించవచ్చు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: