తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యనిర్వహణాధికారిగా ముద్దాడ రవిచంద్ర(Muddada Ravichandra) అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక సాధారణ భక్తుడిగా స్వామివారి భక్తులకు సేవ చేసే అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని, దేవుని ఆశీర్వాదంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని ఆయన తెలిపారు.
Read Also: Maha Shivaratri: శ్రీశైలం వెళ్లే భక్తులకు పండగే.. అరగంటలోనే దర్శనం
టీటీడీ పాలక మండలి, అనుభవజ్ఞుల మార్గనిర్దేశం, ఉద్యోగుల సహకారంతో భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు, సేవలు అందించేందుకు కృషి చేస్తానని, స్వామివారి కృపతో ఈ సేవా కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయని ముద్దాడ రవిచంద్ర పేర్కొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 61,655 మంది భక్తులు దర్శించుకోగా 21,003 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.3.89 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: