తిరుమల: ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్ర పుణ్యక్షేత్రంలో తిరుమలకొండ ఖ్యాతిచెందింది. రోజుకు లక్షమందివరకు భక్తులు వచ్చినా పరిశుభ్రతలో ఎక్కడా రాజీలేని ధోరణితో టిటిడి అధికారులు పర్యవేక్షణ జరుగుతుంది. అలాంటిది దేవదేవునికి తొమ్మిదిరోజులు జరిగే బ్రహ్మోత్సవాల (Brahmotsavala)వేళ భక్తులు రోజుకు 2లక్షలమందివరకు కొండపైనే ఉంటారు. భక్తులు వినియోగించి పడేసిన చెత్తాచెదారాన్ని, ఆలయం ముందు, మాఢవీధుల్లో, తిరుమల అంతటా ధుమ్ముకూడా కనిపించకుండా టిటిడి చేస్తున్న కృషికి ఇప్పుడు ఆదివారం ఉదయం రెండు బ్యాంక్ శాఖలు సామాజిక దృక్పధంతో శుభ్రంచేసే యంత్రాలను విరాళంగా అందించాయి.
ఐడిబిఐ బ్యాంక్ ఎండి ,సిఈఓ రాకేశ్ శర్మ (Rakesh Sharma)18 క్లీనింగయంత్రాలను టిటిడికి విరాళంగా అందించారు. ఈ యంత్రాలను ఆలయం ముందు టిటిడి ఆరోగ్యశాఖ డిప్యూటీ ఈఓ సోమన్నారాయణ, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూదన్కు ఐడిబిఐ హెడ్ సాయికృష్ణ, తిరుపతిశాఖ హెడ్ పల్లిరమేశ్, బ్రాంచ్ మేనేజర్ దూడల రాజేశ్ అందజేశారు.తిరుమలలో అత్యధిక ధుమ్ము, చెత్తను సులభంగా శుభ్రం చేసేందుకు కొన్ని అధునాతన యంత్రాలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విరాళంగా అందజేసింది. ఈ యంత్రాలను స్వయంగా టిటిడి అదనపు ఈఓ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి పరిశీలించి వినియోగించారు. ఆలయం ముందు నీటిని వెద జల్లుతూ శుభ్రం చేసే ఈ యంత్రాలు మరింతగా శుభ్రతలో దోహదపడుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: