📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

TTD: శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయాలపై కీలక నిర్ణయం

Author Icon By Pooja
Updated: January 31, 2026 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉన్న శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, టీటీడీ డాలర్ల ధరలు మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లకు ముందుకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి విక్రయ కౌంటర్లను మూసివేశారు.

Read Also:Sammakka Saralamma: నేటితో ముగియనున్న మేడారం జాతర

TTD

వారానికి ఒకసారి ధరల సవరణే నష్టానికి కారణం

టీటీడీ(TTD) నిబంధనల ప్రకారం బంగారం, వెండి డాలర్ల ధరలను వారానికి ఒకసారి మాత్రమే సవరించటం ఆనవాయితీ. అయితే బులియన్ మార్కెట్‌లో ధరలు రోజువారీగా మారుతుండటంతో, ఈ ధరల వ్యత్యాసం టీటీడీకి ఆర్థిక భారంగా మారింది. ఈ పరిస్థితిని గమనించిన భక్తులు ముఖ్యంగా 5 గ్రాములు, 10 గ్రాముల డాలర్ల కొనుగోళ్లకు అధిక ఆసక్తి చూపడంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.

కొత్త విధానం దిశగా టీటీడీ యోచన

ఈ నష్టాలను నివారించడంతో పాటు విక్రయాల్లో స్పష్టత తీసుకురావడానికి టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇకపై తిరుపతి బులియన్ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ డాలర్ల ధరలను నిర్ణయించి విక్రయించే అవకాశముంది. అలాగే, శ్రీవారి దర్శన టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే ఒక్క డాలర్ చొప్పున విక్రయించాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. రూ.50 వేలకుపైగా కొనుగోలు చేసే సందర్భాల్లో పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కొత్త విధానాన్ని ఒకటి లేదా రెండు రోజుల్లో అమల్లోకి తీసుకువచ్చి, బంగారం–వెండి డాలర్ల విక్రయాలను మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu SrivariGold tirumala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.