📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

Tirumala: టీటీడీ ‘మొబైల్ జల ప్రసాదం’ ప్రారంభం

Author Icon By Pooja
Updated: January 4, 2026 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి(Tirumala) దేవస్థానం (టీటీడీ) నిరంతరం కొత్త కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమలకు వచ్చే భక్తులు తాగునీటి సమస్య ఎదుర్కొనకుండా ఉండేందుకు ‘మొబైల్ జల ప్రసాదం’ విధానాన్ని ప్రారంభించింది.

Read Also: Tirupati: గోపురంపై మద్యం మత్తులో వ్యక్తి హల్చల్

Tirumala

మానవ సేవే మాధవ సేవగా శ్రీవారి సేవ

భక్తుల సేవనే పరమావధిగా భావిస్తూ టీటీడీ 2000 నవంబర్‌లో ‘శ్రీవారి సేవ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత 25 ఏళ్లుగా ఈ సేవ ద్వారా 17 లక్షల మందికి పైగా సేవకులు పాల్గొని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందిస్తున్నారు. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు అన్ని వర్గాల వారు శ్రీవారి సేవలో పాల్గొని భక్తులకు సహాయం చేస్తున్నారు.

భక్తుల వద్దకే తాగునీరు.. మొబైల్ జల ప్రసాదం ప్రత్యేకత

ఇప్పటివరకు క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, దర్శన మార్గాల్లో కులాయిలు, డ్రమ్‌ల ద్వారా తాగునీటిని టీటీడీ అందిస్తోంది. అయితే బయటి క్యూ లైన్లు మరియు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో, వాటిని నివారించేందుకు మొబైల్ జల ప్రసాదం విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానంలో తాగునీటిని భక్తుల దగ్గరకే తీసుకెళ్లి అందిస్తున్నారు.

శ్రీవారి సేవకుల ద్వారా నీటి పంపిణీ

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి(Tirumala) సేవలో పాల్గొనే వారికి 10 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ క్యాన్లు అందజేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సేవకులు భక్తులకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో 15 వాటర్ క్యాన్లతో ఈ సేవను అమలు చేస్తుండగా, భక్తుల నుంచి వచ్చే స్పందనను బట్టి దీన్ని మరింత విస్తరించాలని టీటీడీ భావిస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Google News in Telugu Latest News in Telugu MobileJalaPrasadam Vaikuntadwaradarshan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.