Tirumala : ”తిరుమలలో మద్యం సేవించిన వ్యక్తి” అనే ప్రచారం అసత్యం

Read Time:  1 min
Tirumala : ”తిరుమలలో మద్యం సేవించిన వ్యక్తి” అనే ప్రచారం అసత్యం
FONT SIZE
GET APP

తిరుమల : ఇటీవల సోషల్ మీడియా వేదికలలో ప్రచారం అవుతున్న ఒక వీడియోలో మద్యం సేవిస్తున్న వ్యక్తి (Man Drinks Alcohol) దృశ్యాలను తిరుమలలో జరిగినదిగా వర్ణిస్తూ పుకార్లు వ్యాప్తి చేస్తున్నట్లుగా టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ ప్రచారాన్ని టీటీడీ (Ttd Gives Clarity) పూర్తిగా ఖండిస్తోంది.

తిరుమల లో అపచారం అంటూ ఫేక్ న్యూస్ వైరల్

సంబంధిత ఘటన అలిపిరి ప్రారంభంలో అంటే తనిఖీ కేంద్రానికి వచ్చే ముందు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతం తిరుమల ప‌రిధిలోకి రాదు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు వ్య‌క్తులు ప్ర‌చార యావ‌తో తిరుమ‌ల‌లో అప‌చారం జ‌రిగిందంటూ ప్ర‌చారం చేయ‌డం మ‌హాపాపం.

తప్పుడు ప్రచారాలను నమ్మకూడదు

ఈ నేపథ్యంలో భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల పవిత్రతను దెబ్బతీసే అసత్యాలను ప్రచారం చేస్తున్న‌వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించ‌డ‌మైన‌ది.

Read Also : Manish Sisodia: సిబిఐ విచారణకు సిసోడియా డుమ్మా

Digital

రచయిత గురించి

Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.