📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala: వైకుంఠ ఏకాదశికి శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Author Icon By Pooja
Updated: December 24, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలి యుగప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆల యంలో వైకుంఠ ఏకాదశి(Tirumala) పర్వదినం ముందు ముందు మంగళవారం ఉద యం కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు మహాయజంలా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయం అంతటా సుగంధపరిమళ ద్రవ్యంతో శుద్ధి చేశారు.

Read Also: V Narayanan: శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్.. సీఎంఎస్-03 ఉపగ్రహానికి ప్రత్యేక పూజలు

Tirumala

ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు సాగిన ఈ మహాయజంలో రాష్ట్రమంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనంరామనారాయణరెడ్డి, టిటిడి ఛైర్మన్ బిఆర్నాయుడు, టిటిడి ఇఒ అనిల్కుమార్సింఘాల్, బోర్డు సభ్యులు భానుప్రకాశొడ్డి, నరేష్కుమార్, శాంతారాం, సదాశివరావు, టిటిడి సివిఎస్ కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, ఆలయ పేష్కార్ రామకృష్ణ, ఆలయ అర్చకులు, ఉద్యోగులు పాల్గోని ఆలయంలోపల(Tirumala) బంగారువాకిలి నుండి ఉప ఆలయాలు, మహద్వారం వరకు నీటితో శుభ్రంగా కడిగారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరిపసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంద ద్రవ్యాలు కలగలిపిన పరిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా సంప్రోక్షణ చేశారు.

ఉదయం 10గంటలకు ప్రోటోకాల్ విఐపిలకు బ్రేక్ దర్శనం చేయించి నంతరం 11గంటలకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈసందర్భంగా ఆలయంలో జరగాల్సిన అష్టదళపాదపద్మారాధన సేవ రద్దయ్యింది. ఏడాదిలో వైకుంఠ ఏకాదశి, ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు ముందువచ్చే మంగళవారాల్లో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టడం ఆనవాయితీ.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu TTD Vaikunta Ekadashi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.