శ్రీవారి మెట్ల ఉత్సవ ముహూర్తం పిక్స్

Read Time:  1 min
శ్రీవారి మెట్ల ఉత్సవ ముహూర్తం పిక్స్
FONT SIZE
GET APP

తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది మంగళవారం నాడు 73,599 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.ఇందులో 16,069 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు ఆ ఒక్కరోజులో హుండీ ద్వారా 3.21 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పక్కనున్న కంపార్ట్‌మెంట్లు ఖాళీ అయ్యాయి దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి ఉండవలసిన అవసరం లేదు.క్యూలైన్ ద్వారా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు అయితే టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడింది.ఈ సమయంలో టీటీడీ సిబ్బంది మరియు శ్రీవారి సేవకులు క్యూలైన్లలో ఉన్న భక్తులకు అల్పాహారం,పాలు, మంచినీరు అందించారు.ఇక తిరుమలలో వచ్చే నెల 11న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

శ్రీవారి మెట్ల ఉత్సవ ముహూర్తం పిక్స్
శ్రీవారి మెట్ల ఉత్సవ ముహూర్తం పిక్స్

ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మెట్లోత్సవం జరగనుంది.తిరుమల ఆస్థాన మండపంలో ఈ కార్యక్రమం జరగనుంది. 11, 12వ తేదీల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు భజన మండళ్లతో స్వామివారి నామ సంకీర్తన సామూహిక భజన, ధార్మిక సందేశాలు వినిపించబడతాయి. ఈ కార్యక్రమంలో మహనీయులు మానవాళికి అందించిన ఉపదేశాలను వినిపిస్తారు. 12వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటలకు అలిపిరి పాదాల మండపంలో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం భజన మండలి సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ మెట్ల మార్గం గుండా కాలినడకన సప్తగిరీశుడి సన్నిధికి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు సంగీత విభావరి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.ఈ విధంగా తిరుమలలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించబడుతుంది.

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.