శ్రీశైలంప్రాజెక్టు : శ్రీశైలక్షేత్రంలో(Srisailam) మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పుర స్కరించుకుని వంచాహ్నిక దీక్షతో నిర్వహించ బడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీస్వామి అమ్మ వార్ల ఉభయ దేవాలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులు విర జిమ్ముతున్నాయి. ఏడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు 18వ తేదితో ముగియ నున్నాయి. లోక కల్యాణం కోసం నిర్వహించబ డుతున్న ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామి వారికి విశేషర్చనలు, మహాశక్తిస్వరూపిణి అయిన శ్రీభ్రమ రాంబా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, నవగ్రహ మండ పారాధనలు, కలశార్చనలు, జపాలు, పారా యణలు నిర్వహించబడుతున్నాయి.
Read Also: Telangana: మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ
ఆగమ శాస్త్రాను సారం జరిపించబడ్డాయి. ఉత్సవ నిర్వహణలో ముందుగా కార్యనిర్వహణాధికారి భాగంగా ఎం. శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు భరద్వాజకర్మ, రమణ, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధికారులు(Srisailam) సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగణంలోని స్వామి వార్ల యాగశాల ప్రవేశం చేసారు. తదువరి శివసంకల్పం, గణపతిపూజ, చండీశ్వరపూజ, కంకణపూజ- కంకణధారణ, ఋత్విగ్వరణం, అఖండదీవ స్థావన, సాయంకాలం అంకురార్పణ, ధ్వజారోహన కార్యక్రమాలు నిర్వహించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: