ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ క్షేత్రమైన సింహగిరిపై కొలువై ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారిని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) దర్శించుకున్నారు. దేవస్థాన అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కేంద్రమంత్రి (Shivraj Singh Chauhan), భక్తుల నమ్మకమైన ‘కప్పస్తంభాన్ని’ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Also: Gold rate 26/12/25 : బంగారం ఆగట్లేదు! 26న మళ్లీ పెరిగిన ధరలు
వేద ఆశీర్వచనం.. తీర్థప్రసాదాలు
నిత్యం చందనపు పూతతో దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. దర్శనానంతరం ఆలయ ఆస్థాన పండితులు మంత్రికి వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి శేష వస్త్రంతో ఆయనను ఘనంగా సత్కరించి, సింహాద్రి అప్పన్న ప్రసాదాలను అందజేశారు. కేంద్రమంత్రి వెంట స్థానిక నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: