గోత్రం అనేది ఒక మూల పురుషుడి నుంచి ప్రారంభమైన వంశ పరంపరకు సూచికగా ఉపయోగించే గుర్తింపు. ప్రాచీన భారతీయ సమాజంలో వంశ, కుల, ఆచారాలను గుర్తించేందుకు గోత్ర వ్యవస్థ కీలకంగా ఉపయోగించబడింది. సంస్కృతంలో ‘గో’ అనే పదానికి వేదం, భూమి, ఆవు వంటి అనేక అర్థాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా, జ్ఞాన పరంపరతో అనుసంధానమైన భావనగా గోత్రాన్ని పండితులు వివరిస్తారు.
ప్రాచీన కాలంలో వశిష్ట, భరద్వాజ, అత్రి, విశ్వామిత్ర, గౌతమ, కశ్యప, జమదగ్ని వంటి సప్తర్షుల పేర్లపై ప్రధాన గోత్రాలు ఏర్పడ్డాయి. వీరిని వంశాల(Sanatana Dharma) మూల గురువులుగా భావిస్తారు. ప్రతి గోత్రం ఒక ఋషి పరంపరతో సంబంధం కలిగి ఉండటంతో, వ్యక్తి ఏ ఆధ్యాత్మిక గురు వంశానికి చెందినవాడో గోత్రం ద్వారా తెలుసుకోవచ్చు.
కాలక్రమేణా సమాజం విస్తరించడంతో పాటు ప్రముఖ పూర్వీకులు, రాజవంశాలు, సామాజిక నాయకుల పేర్లతో కూడా ఉపగోత్రాలు మరియు కొత్త గోత్రాలు ఏర్పడ్డాయి. అందువల్ల గోత్ర వ్యవస్థ కేవలం మతపరమైన గుర్తింపుగా కాకుండా, సామాజిక-సాంస్కృతిక పరంపరగా కూడా మారింది.
గోత్రం – సంప్రదాయాల్లో ఉన్న పాత్ర
హిందూ సంప్రదాయాల్లో గోత్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వివాహాలలో ఒకే గోత్రానికి చెందిన వారితో పెళ్లి చేయకూడదనే సంప్రదాయం(Sanatana Dharma) అనుసరిస్తారు. ఇది వంశ పరంపరను, జన్యుపరమైన సంబంధాలను కాపాడేందుకు రూపొందిన ఆచారంగా భావిస్తారు. అలాగే పూజలు, శ్రాద్ధ కర్మలు, ఉపనయనం వంటి సంస్కారాలలో కూడా గోత్రం ఉచ్ఛారణ తప్పనిసరిగా ఉంటుంది.
గోత్రం మన పూర్వీకుల పట్ల గౌరవాన్ని, వంశ పరంపరపై గర్వాన్ని గుర్తుచేసే గుర్తింపుగా పరిగణిస్తారు. ఆధునిక కాలంలో కూడా చాలామంది తమ గోత్రాన్ని తెలుసుకోవడం, కుటుంబ చరిత్రను గుర్తించడం ద్వారా తమ మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: