సన్వాలియా సేథ్ ఆలయంలో భక్తుల విరాళాల వెల్లువ చరిత్రలోనే అత్యంత భారీ కానుకలు రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ సన్వాలియా సేథ్ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆలయంలో ఇటీవల హుండీ విరాళాల లెక్కింపులో భారీగా నగదు, బంగారం, వెండి వస్తువులు రికార్డు స్థాయిలో సమర్పించబడటం విశేషం. భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. చిన్న బంగారు బిస్కెట్లు, వెండి కళాఖండాలు, వెండి తాళాలు, వేణువులు, ఇరవై మూడు కోట్ల రూపాయల నగదు, కిలో బరువున్న బంగారు బిస్కెట్ వంటి విభిన్న వస్తువులు హుండీలో లభించాయి.
ఆలయ అధికారులు ఈ విరాళాలను అనేక దశల్లో లెక్కించడంలో బిజీగా ఉన్నారు. లెక్కింపులో మూడు దశలు రెండు నెలల విరామం తర్వాత హుండీ లెక్కింపును ప్రారంభించారు. తొలి దశలో రూ.11.34 కోట్లు, రెండోదశలో రూ.3.60 కోట్లు, మూడోదశలో రూ.4.27 కోట్లు లెక్క తేలింది. ఇప్పటి వరకు మొత్తం రూ.19.22 కోట్లు లెక్కించగా, ఇంకా కొన్ని దశల లెక్కింపు కొనసాగుతోంది.అంతేకాదు, ఆన్లైన్ విరాళాలు, గిఫ్ట్ రూమ్ల నుంచి వచ్చిన బంగారం, వెండి వస్తువుల తూకం, వాటి ఖరీదుల నిర్ధారణ కూడా కొనసాగుతూనే ఉంది.
1840లో ప్రారంభమైన ఆలయ చరిత్ర ఈ ఆలయానికి 1840లో ముడిపడిన చరిత్ర ప్రత్యేకమైనది. భోలారం గుర్జార్ అనే పాల వ్యాపారి కలలో కృష్ణుడి విగ్రహం కనిపించిందట. ఆయన కలలో కనిపించిన ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపితే, మండఫియా, భద్సోడా చాపర్ ప్రాంతాల్లో మూడు విగ్రహాలు వెలుగుచూశాయి. ఈ విగ్రహాలను మండఫియా ఆలయంలో ప్రతిష్ఠించి, శ్రీ సన్వాలియా ధామ్ అనే పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేశారు.
వైష్ణవ భక్తులకు ప్రత్యేకత సన్వాలియా సేథ్ ఆలయం వైష్ణవ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రం. నాథద్వారా ఆలయానికి తర్వాత ఇదే రెండో స్థానం. చిత్తోర్గఢ్-ఉదయ్పూర్ హైవేపై 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు భక్తుల సమర్పణల ద్వారా చరిత్రలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మీరాబాయి ఆధ్యాత్మిక అనుబంధం స్థానిక కధనాల ప్రకారం, ప్రసిద్ధ కవయిత్రి మరియు కృష్ణుడి భక్తురాలు మీరాబాయి కూడా ఈ ఆలయంలో కృష్ణుడిని పూజించినట్లు చెప్పబడుతోంది. ఆధ్యాత్మికత, ఆచారాలు, భక్తి పరంపర ఈ ఆలయాన్ని మరింత మహిమవంతంగా నిలబెట్టాయి. సన్వాలియా సేథ్ ఆలయం ప్రస్తుతం విరాళాల పరంగా రికార్డు స్థాయిలో నిలుస్తూ భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.