📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించం – టీటీడీ ఛైర్మన్

Author Icon By Sudheer
Updated: April 16, 2025 • 2:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమలలో భక్తుల ప్రశాంతతకు భంగం కలిగించేలా ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించబోమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తిరుమల రాజకీయ వేదిక కాదు. కొండపై ఎవరైనా రాజకీయ ప్రస్థావనలు చేస్తే దానిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

తిరుమల పవిత్రతను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యత అని, అది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మారకూడదని ఆయన తెలిపారు. ఇటీవల తెలంగాణకు చెందిన నేత తిరుమల కొండపై చేసిన రాజకీయ వ్యాఖ్యల విషయంలో టీటీడీ సీరియస్‌గా వ్యవహరిస్తోందని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని ఆయన అన్నారు.

ఇక తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీటీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల ప్రతి భక్తుడికి సమానమైన సేవలందిస్తుందని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. టీటీడీ సేవల విషయంలో ప్రాంతీయ వివక్ష అంటూ ఉండదని ఆయన ఖండించారు. తిరుమలలో భక్తుల కోసం ఏర్పాట్లు, సేవలు, నియమాలు ఖచ్చితంగా పాటించాలనే ఉద్దేశ్యంతోనే నిర్వహణ సాగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కొండపై ప్రశాంత వాతావరణాన్ని కాపాడటమే తమ బాధ్యత అని, ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు తిరుమల పవిత్రతను మసకబార్చేలా మారవద్దని కోరారు. ఈ పరిణామంతో తిరుమల కొండపై రాజకీయ ఆరోపణలు, వివాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని భక్తులు పేర్కొన్నారు. తిరుమలలో రాజకీయం కాకుండా ఆధ్యాత్మికతే ముఖ్యమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

BR Naidu Political comments tirumala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.