ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర భక్తితో పాటు ఆర్థిక పరంగానూ సరికొత్త రికార్డులను సృష్టించింది. నాలుగు రోజుల పాటు కనీవినీ ఎరుగని రీతిలో సాగిన ఈ వేడుకలో భక్తులు సుమారు రూ. 1,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ఈ జాతరకు సుమారు కోటిన్నర మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడంతో పాటు, తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా భక్తులు భారీ ఎత్తున విందువినోదాలకు ప్రాధాన్యతనిచ్చారు.
HYD : హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!
ఈ జాతరలో భక్తులు నైవేద్యంగా సమర్పించిన మొక్కుల విలువ అక్షరాలా కోట్లలో ఉంది. అందిన సమాచారం ప్రకారం, జాతర ప్రాంగణంలో సుమారు 14 లక్షల గొర్రెలు, మేకలు మరియు కోళ్లను బలి ఇచ్చారు. కేవలం మాంసం మరియు మద్యం కోసమే భక్తులు దాదాపు రూ. 400 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇందులో మద్యం విక్రయాలు సుమారు రూ. 10 కోట్ల మేర జరిగినట్లు అంచనా. మేడారం పరిసరాల్లో ఎక్కడ చూసినా భక్తులు తమ బంధుమిత్రులతో కలిసి విందులు చేసుకోవడం వల్ల స్థానిక వ్యాపారం ఊపందుకుంది.
జాతరలో కేవలం విందులే కాకుండా అమ్మవార్లకు సమర్పించే నివేదనల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి.
బంగారం (బెల్లం): అమ్మవార్లకు సుమారు 500 టన్నుల బెల్లాన్ని భక్తులు సమర్పించారు.
కొబ్బరికాయలు: కోటికి పైగా కొబ్బరికాయల అమ్మకాలు జరిగినట్లు సమాచారం.
సారె, గాజులు: మహిళా భక్తులు సమర్పించిన చీరలు, సారె, మరియు గాజుల ద్వారా కూడా భారీ ఎత్తున వ్యాపారం సాగింది.
ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు మరియు భక్తుల అచంచల విశ్వాసం వెరసి, మేడారం జాతర అటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆర్థికంగా రాష్ట్రానికి ఒక భారీ శక్తిగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com