పండితుల ప్రకారం, పౌర్ణమి(Karthika Pournami) తిథి ఇవాళ రాత్రి 10.30 గంటలకు ప్రారంభమై, రేపు సాయంత్రం 6.48 గంటల వరకు కొనసాగుతుంది. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం ఎక్కువగా ఉండటంతో రేపు వ్రతం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తున్నారు.
Read Also: AP Liquor Scam: లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పురోగతి

ఉదయం నదీ స్నానం, సాయంత్రం దీపారాధన శ్రేష్ఠ
రేపు ఉదయం 4.52 నుంచి 5.44 గంటల మధ్య నదీ స్నానం చేసి, పుణ్యకార్యాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఈ స్నానం ద్వారా పాప పరిహారం మరియు ఆత్మశుద్ధి కలుగుతుందని నమ్మకం. సాయంత్రం 5.15 నుంచి 7.05 గంటల మధ్య దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ సమయాన్ని దీపదానం, పూజలు, భక్తి కార్యక్రమాలకు అత్యుత్తమ ముహూర్తంగా పరిగణిస్తున్నారు.
దీపారాధనలో 365 వత్తులు ఎందుకు ప్రత్యేకం?
పండితుల వివరాల ప్రకారం, కార్తీక పౌర్ణమి(Karthika Pournami) నాడు 365 వత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరంలోని అన్ని దోషాలు తొలగి, కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కలుగుతాయని చెబుతున్నారు. ఈ రోజు శివుడు, విష్ణువు, త్రిపురాంతక రూపంలో ఉన్న పరమేశ్వరుడుకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల అనేక పుణ్యఫలాలు లభిస్తాయని నమ్మకం ఉంది. ఈ పౌర్ణమి రోజున దీపదానం, గంగా స్నానం, హరినామ స్మరణ, భగవద్భక్తి చేయడం అత్యంత పుణ్యప్రదం. అనేక ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దీపోత్సవాలు, హోమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: