Medaram : జనం నుండి వనంలోకి బయలుదేరిన దేవతలు

Read Time:  1 min
Medaram : జనం నుండి వనంలోకి బయలుదేరిన దేవతలు
FONT SIZE
GET APP

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర శనివారం సాయంత్రం అత్యంత భక్తిపారవశ్యంతో ముగింపు దశకు చేరుకుంది. నాలుగు రోజుల పాటు కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకున్న వనదేవతలు తిరిగి గద్దెల నుంచి వనంలోకి బయలుదేరారు. జాతరలో చివరి ఘట్టమైన ‘వన ప్రవేశం’ కార్యక్రమం ప్రారంభం కావడంతో మేడారం అడవులన్నీ ‘అమ్మో.. సమ్మక్క.. తల్లి.. సారలమ్మ’ అనే నామస్మరణతో మారుమోగుతున్నాయి. అమ్మవార్లను సాగనంపే క్రమంలో భక్తులు కన్నీటి వీడ్కోలు పలుకుతూ తమ మొక్కులను సమర్పించుకుంటున్నారు.

ప్రధాన ఘట్టంలో భాగంగా గద్దెల వద్ద పూజారులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వనదేవతల తిరుగు ప్రయాణం మొదలైంది. కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్క అమ్మవారు చిలకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి తరలివెళ్తున్నారు. వీరితో పాటు పగిడిద్దరాజు పూనుగొండ్లకు, గోవిందరాజు కొండాయికి తమ స్వస్థలాలకు పయనమయ్యారు. ఈనెల 28న ప్రారంభమైన ఈ జాతర, గిరిజన సాంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా సాగింది. దేవతలు వనంలోకి వెళ్లే సమయంలోనూ భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవార్ల చివరి దర్శనం కోసం పోటీ పడటం విశేషం.

Vasundhara Yadav : అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్

ఈ ఏడాది జాతర గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది మంది జనసందోహంతో చారిత్రాత్మక విజయవంతమైంది. భక్తులు సమర్పించిన కోడెలు, బంగారం (బెల్లం) గద్దెల వద్ద పర్వతాలలా పేరుకుపోయాయి. వనదేవతలు వనప్రవేశం చేసినప్పటికీ, ఇప్పటికీ మేడారంలో లక్షలాది మంది భక్తులు ఉండటంతో అధికారులు భద్రతా చర్యలను కొనసాగిస్తున్నారు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా సాగిన ఈ మహా జాతర, ప్రకృతి ఆరాధనే పరమావధిగా దేవతలు జనం నుంచి తిరిగి వనంలోకి వెళ్లడంతో ఈ ఏడాదికి ముగిసింది. మళ్ళీ రెండేళ్ల తర్వాత జరిగే జాతర కోసం భక్తులు ఇప్పుడే ఎదురుచూడటం మొదలుపెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.