हिन्दी | Epaper

Godavari Pushkaralu: 2027 జూన్ 26 నుంచి పుష్కరాలు ప్రారంభం

Pooja
Godavari Pushkaralu: 2027 జూన్ 26 నుంచి పుష్కరాలు ప్రారంభం

Godavari Pushkaralu: 2027 జూన్ 26వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నట్లు ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడిస్తూ, పుష్కరాల నిర్వహణకు విస్తృత స్థాయి ఏర్పాట్లు అవసరమని చెప్పారు.

Read Also:Tirumala: వేదాశీర్వచనానికి మేలాఛాట్ వస్త్రాల కొరత!

Godavari Pushkaralu
Pushkaralu to begin from June 26, 2027

గోదావరి పవిత్రత కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం

పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు గోదావరి నదిలో స్నానాలు చేయనున్న నేపథ్యంలో, నది స్వచ్ఛతను కాపాడటం అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం నదిలో డ్రెయిన్ల ద్వారా మురుగు నీరు చేరడం, పరిశ్రమల వ్యర్థాలు కలవడం వల్ల కాలుష్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసిన మంత్రి, నదిలో జంతు కళేబరాలు, పౌల్ట్రీ వ్యర్థాలను కలిపేస్తున్న ఘటనలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పుష్కరాల నిర్వహణలో మౌలిక సదుపాయాలు, భద్రత, పారిశుధ్యం, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. గోదావరి నది శుద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కూడా అధికారులకు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870