భోగి పండుగ సందర్భంగా వెలిగించే మంటలను సాధారణ అగ్నిగా కాకుండా(Fire Safety) హోమం తరహాలో పవిత్రంగా భావించాలని పురోహితులు సూచిస్తున్నారు. ఈ మంటల్లో చెత్త, ప్లాస్టిక్, పాత రబ్బరు వంటి అపవిత్ర వస్తువులు వేయడం వల్ల అశుభ ఫలితాలు కలగడమే కాకుండా పర్యావరణానికి కూడా హానికరమని చెబుతున్నారు. అగ్నిని ప్రజ్వలింపజేయడానికి కిరోసిన్, పెట్రోల్ వంటి ఇంధనాలను ఉపయోగించకుండా, సంప్రదాయంగా కర్పూరం లేదా నెయ్యిని మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు.
భోగి మంటల చుట్టూ పాదరక్షలు ధరించి ప్రదక్షిణ చేయడం(Fire Safety) తగదని, అలాగే ఎంగిలి చేసిన ప్రసాదాన్ని అగ్నిలో సమర్పించకూడదని తెలిపారు. భక్తితో, శుభాశయాలతోనే ఈ క్రియలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. భోగి మంటల వద్ద పిల్లలను ఒంటరిగా వదలకుండా పెద్దలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇక భోగి రోజున మాటలతో గానీ, ప్రవర్తనతో గానీ ఎవరికైనా అవమానం కలిగించడం, మనసు నొప్పించడం వంటివి చేయరాదని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ పర్వదినాన్ని శాంతి, ఐక్యత, సద్భావంతో జరుపుకుంటే ఇంట్లో సుఖశాంతులు, శుభఫలితాలు కలుగుతాయని వారు సూచిస్తున్నారు.