తిరుమల శ్రీవారికి భక్తులు అర్పించే విరాళాల ప్రవాహం ఎప్పటికీ ఆగదు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు గత 11 నెలల్లో మొత్తం రూ.918.59 కోట్ల విరాళాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విరాళాల ద్వారా తిరుమల భక్తుల భక్తిశ్రద్ధ, దేవాలయంపై ఉన్న విశ్వాసం ఎంత గాఢంగా ఉందో మరోసారి రుజువైంది. వీటిలో ఆన్లైన్ ద్వారా రూ.579.38 కోట్లు, ఆఫ్లైన్ ద్వారా రూ.339.2 కోట్లు సమకూరాయి. ఈ మొత్తం దానాల ద్వారా దేవస్థానం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం అవుతాయని అధికారులు తెలిపారు.
Breaking News – Diwali Celebration : వైట్ హౌస్లో దీపావళి వేడుకలు.. భారతీయులకు ట్రంప్ విషెస్
వివరాల్లోకి వెళితే, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు అత్యధికంగా రూ.338.8 కోట్లు విరాళాల రూపంలో చేరాయి. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా అన్నప్రసాదం అందించే ఈ ట్రస్టు పట్ల భక్తులు చూపిస్తున్న విశ్వాసం అపారం. శ్రీవాణి ట్రస్టుకు రూ.252.83 కోట్లు రావడం గమనార్హం. ఈ ట్రస్టు ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు పొందే విధానం సులభతరం చేయడమే కాకుండా, వచ్చిన విరాళాలను వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. అలాగే ఎస్వీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.97.97 కోట్లు, ప్రాణదానం ట్రస్టుకు రూ.66.53 కోట్లు, గోసంరక్షణకు రూ.56.77 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.33.47 కోట్ల విరాళాలు అందాయి.
తిరుమలలో శ్రీవారి సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా భక్తుల సహకారంతో కొనసాగుతున్నాయి. దాతలు చిన్న పెద్ద తేడా లేకుండా తమ సత్తా మేరకు విరాళాలు అందిస్తూ భక్తి పూర్వకంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు భక్తులు కూడా ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ద్వారా తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఈ విరాళాల ద్వారా TTD విద్య, వైద్యం, గోసంరక్షణ, అన్నప్రసాదం వంటి పుణ్య కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మొత్తానికి, తిరుమల శ్రీవారి ట్రస్టులకు వస్తున్న ఈ విరాళాలు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/