📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపు శనివారం “శంఖుచక్ర దీపం” వెలిగిస్తే ఎంతో శుభం..

Author Icon By Sudheer
Updated: November 15, 2024 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కార్తిక మాసంలో వేంకటేశ్వర శంఖుచక్ర దీపం వెలిగిస్తే ఎంతో శుభమని పండితులు చెపుతున్నారు. ఇది భక్తులకు స్వామి అనుగ్రహం అందించి, ఆధ్యాత్మిక శ్రేయస్సును కలిగించడమే కాకుండా, కలి యుగంలోని బాధలు, దోషాలను తొలగిస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ ప్రక్రియలోని ప్రతి దశ ఎంతో శ్రద్ధతో, భక్తితో చేయాలి.

వేంకటేశ్వర శంఖుచక్ర దీపం వెలిగించే పద్ధతి: ఉదయం నిద్రలేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసి, తలస్నానం చేయాలి. పూజ గదిని అలంకరించి దీపం వెలిగించాలి. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఫొటోకి గంధం, కుంకుమతో బొట్లు పెట్టాలి. సాధారణ దీపాలను వెలిగించాలి. పూజా మండపంలో పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి, పీటపై అష్టదళ పద్మం ముగ్గు వేయాలి.అలాగే బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలను కలిపి రెండు పిండి దీపాలను తయారు చేయాలి. పిండి దీపాలపై తడి గంధంతో తిరునామాలు దిద్దాలి. తరువాత, లోహంతో తయారు చేసిన చిన్న శంఖ, చక్రాలను అలంకరించాలి. ఆవు నెయ్యి నింపిన పిండి దీపాలకు కుంభ వత్తులు ఉపయోగించి జ్యోతులను వెలిగించాలి. ఈ శంఖుచక్ర దీపం వెలిగించడం వలన వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతోపాటు ఆధ్యాత్మిక శాంతి, సంపదలు లభిస్తాయని, కలి పీడలు తొలగిపోతాయని విశ్వసిస్తున్నారు. ఇది శ్రద్ధ, భక్తి, పద్ధతులతో చేయాల్సిన ఆచారం. ఈ కార్తిక మాసంలో శనివారం లేదా మీకు అనుకూలమైన రోజున దీన్ని ఆచరించడం వల్ల పూజ ఫలితాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని పండితులు సూచిస్తున్నారు.

shanku chakra deepam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.